-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, నవంబర్ 13: నిర్థిష్టమైన పెట్టుబడుల ప్రణాళికలు (ఎస్ఐపీలు) అమలు చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ గత అక్టోబర్ మాసంలో రూ. 8,246 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే ఇది 3.2 శాతం అధికం.
న్యూఢిల్లీ, నవంబర్ 13: కేంద్ర ఆర్థిక మంత్రి త్వ శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ను రూపొందించే కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో చేయవలసిన మార్పుల గురించి సూచనలు ఇవ్వవలసిందిగా పరిశ్రమ వర్గాలను, వాణిజ్య సంస్థలను కోరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇలా సూచనలు ఇవ్వాల్సిందిగా కోర డం బహుశా ఇదే మొదటిసారి.
విశాఖపట్నం: అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి వచ్చే పర్యాటకుల కోసం విశాఖ-అరకు మధ్య ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య తెలిపారు.
న్యూఢిల్లీ, నవంబర్ 12: మదుపర్లు గడచిన అక్టోబర్ మాసంలో ‘బంగారు మారక వాణిజ్య నిధి’ (ఈటీఎఫ్లు) నుంచి రూ. 31 కోట్లు ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు రెండు నెలల కాలంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారానే్న పెట్టుబడులకు భత్రతతో కూడిన మార్గంగా భావించి రూ. 200 కోట్లు మదుపుచేశారు. తాజా పరిస్థితుల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారని వాణిజ్య వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 12: సమాచార సంకేతిక (ఐటీ) రంగంలో ప్రత్యేక ఆర్థిక జోన్లు (సెజ్లు) ఏర్పాటుకు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్లు వేర్వేరుగా సమర్పించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం వచ్చే శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెజ్లపై అత్యున్నత నిర్ణయాధికారాలు కలిగిన విభాగం ‘బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్’ ఈనెల 15 జరిగే సమావేశంలో ఈప్రతిపాదనలపై చర్చించనుంది.
న్యూఢిల్లీ, నవంబర్ 12: ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థిక పరిశోథనా విభాగం తాజాగా 5 శాతానికి కుదించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా ఉంటుందని గతంలోప్రకటించిన ఈ విభాగం తాజాగా ఆ అంచనాలను సవరించి 5 శాతానికి కుందించడం విశేషం.
న్యూఢిల్లీ, నవంబర్ 12: పసిడి ధరలు మంగళవారం మరోమారు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 130 తగ్గి మొత్తం ధర రూ. 38,500కు దిగివచ్చింది. సోమవారం ఈ ధర రూ. 38,680గా ఉంది. కాగా వెండి ధర సైతం దిద్దుబాటుకు గురై తాజాగా కిలోపై రూ. 90 తగ్గి మొత్తం ధర రూ. 45,080కి చేరింది. అలాగే 24 క్యారెట్ల స్పాట్ గోల్డ్ ధరలు సైతం రూ. 130 తగ్గాయి.
న్యూఢిల్లీ: రానున్న పది, పదిహేను సంవత్సరాల్లో భారతదేశం పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదన్న విశ్వాసాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యక్తం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 11: రాష్ట్రంలోని అన్ని పెట్రోలు బంకుల్లో బాటిళ్లలో ‘పెట్రో’ విక్రయాలను నిషేధిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్లోని దాదాపు 70 వేలమంది ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం ఇప్పటికే అంగీకారాన్ని తెలిపారని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ సోమవారం నాడిక్కడ తెలిపారు. గత వారం వీఆర్ఎస్ పథకం అమలులోకి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్ధలోని దాదాపు లక్ష మంది ఉద్యోగులు వీఆర్ఎస్కు అర్హులుగా ఉన్నారని తెలిపారు.