S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/01/2017 - 00:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశీయ బ్యాంకింగ్ రంగ ఉనికిని మొండి బకాయలు ప్రశ్నార్థకం చేస్తున్నాయ. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు మొండి బకాయల సెగ అధికంగా తగులుతోంది. వీటిలో ఎస్‌బిఐ ముందు వరుసలో ఉండగా, తర్వాతి వరుసలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. ఎస్‌బిఐ నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ) విలువ గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 55,807 కోట్ల రూపాయలుగా నమోదైంది.

12/31/2016 - 00:38

విజయ్ మాల్యా వ్యవహారం

12/31/2016 - 00:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పన్నులకు సంబంధించి తమ పాత వివాదాలను పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వొడాఫోన్, కెయర్న్ ఎనర్జీలాంటి కంపెనీలకు మరో నెల గడువు ఇచ్చింది. ఈ నెల 31తో ముగియనున్న ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కార పథకాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు జనవరి 31 దాకా పొడిగించింది.

12/31/2016 - 02:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: రద్దయిన పాత పెద్ద నోట్ల డిపాజిట్లకు సంబంధించిన మొత్తం వివరాలను తక్షణం తమకు తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) దేశంలోని అన్ని బ్యాంకులను ఆదేశించింది.

12/31/2016 - 00:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ద్వంద్వ పన్నులకు సంబంధించి ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలను సవరించి ఈ ఏడాది మారిషస్, సైప్రస్‌తో కొత్త ఒప్పందాలను కుదుర్చుకున్న భారత్.. శుక్రవారం తాజాగా సింగపూర్‌తోనూ అలాంటి ఒప్పందమే కుదుర్చుకుంది. భారత్‌లో సింగపూర్ హైకమిషనర్ లిమ్ తువాన్ కువాన్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

12/30/2016 - 00:55

ముంబయి, డిసెంబర్ 29: లావాదేవీల చివర్లో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగడంతో దేశీయ మార్కెట్లు గురువారం మంచి లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సూచీ సెనె్సక్స్ 155 పాయింట్లు పెరిగి 2 వారాల గరిష్ఠస్థాయి అయిన 26,366 పాయింట్ల వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం తిరిగి 8,100 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఉదయం స్టాక్ మార్కెట్లు సానుకూల ధోరణిలోనే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కూడా నిలకడగానే కొనసాగాయి.

12/30/2016 - 00:54

ముంబయి, డిసెంబర్ 29: వస్తు సేవల పన్ను(జిఎస్‌టి), పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులనే పూర్తిగా మార్చివేయగలవని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయ పడింది. నోట్లరద్దు నిర్ణయం ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు కలగజేసినప్పటికీ, అలాగే వృద్ధి రేటుపై ఆ క్షణానికి ప్రతికూల ప్రభావం చూపించినప్పటికీ అది దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చి వేయగలదని ఆర్‌బిఐ పేర్కొంది.

12/30/2016 - 00:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: సరైన పద్ధతులు పాటించకుండా బ్యాంకుల్లో సొమ్మును డిపాజిట్ చేసినంత మాత్రాన నల్లధనం తెల్లగా మారబోదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో దాదాపు 60 లక్షల మంది వ్యక్తులు, సంస్థలు సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్లు చేసినట్లు పక్కా సమాచారం అందడంతో కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

12/30/2016 - 00:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో సత్ఫలితాలు రావటం ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్ళు బాగా పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకుంటోందని గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

12/30/2016 - 00:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని రిజర్వు బ్యాంకు నూతన డిప్యుటీ గవర్నర్‌గా నియమితులైన ప్రముఖ ఆర్థికవేత్త విరల్ ఆచార్య స్పష్టం చేశారు. ఆర్‌బిఐ డిప్యుటీ గవర్నర్‌గా తనకు అవకాశం కల్పించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానని ఆయన గురువారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.

Pages