S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయిన్ ఫీచర్
అందుకే, ఇతడు అయోధ్యాధిపతి. ‘‘దేవానాం పూరయోధ్యా’’(దేవతల నగరమైన హృదయపద్మమే అయోధ్య) - అని శ్రుతి!
కర్కోటకుడి గురుత్వం:
గురువులు చేసే ఆత్మవిద్యోపదేశక్రమంలో శిష్యులకు సత్సాంగత్యం కలిగించడం ఒక ప్రధాన సోపానం. ‘‘సత్సంగత్వే నిస్సంగత్వం’’అని గదా ఆదిశంకరుల అమరసూక్తి! ఈ సత్సాంగత్యసిద్ధికోసమే కర్కోటకుడు నలుడ్ణి ఋతుపర్ణుడి దగ్గరికి ప్రత్యేకంగా చెప్పి పంపించాడు.
అందులోనూ ‘‘ఋతుపర్ణస్య రాజర్షేః’’ అంటూ అనామకుడైన ఋతుపర్ణుడ్ణి రాజర్షిగా కీర్తించటంలో ఔచిత్యమేమిటి? కథలో ఆ రాజుకి ఏ రకమైన ప్రాధాన్యమూ కనుపించటం లేదు కదా?!’’ - అని ఆలోచిస్తున్నారా?
ఇది తెలియాలంటే, కర్కోటకుడు నలుడికి ఏమి ఉపదేశం చేశాడో పరిశీలించాలి.
ఏదో ఒక కర్మశేషలేశం చేత శాశ్వత నిర్వికల్ప సమాధిలో వుండటం కుదరనివారే గురువులు కాగలుగుతారనీ, పరిపూర్ణ జ్ఞాననిష్ఠగలవారు లోకవ్యవహారంలోకి రానే రారు గనుక, వారు శిష్యోపదేశ కృత్యాన్ని గూడా చేపట్టరనీ, వేదాంత గ్రంథాల్లో స్పష్టంగా చెప్పనే చెప్పారు. యోగ వాసిష్ఠం వంటి గ్రంథాలలో ఈ విషయాలు మరింత వివరంగా వున్నాయి.
అందుకే ఆ అపప్రథను మరచిపోయి, కర్కోటక శబ్ద నిర్వచనంలోకి వెళ్ళాలి.
కర్కోటక శబ్దంలో ‘‘కర్క-అట’’అని రెండు విభాగాలున్నాయి.
నరశక్తి- దమశక్తి స్వరూపలైన నలదమయంతులు శివానుగ్రహంతో కలువబోతున్నారు. కనుకనే, వీరిద్దరినీ పరీక్షించి చూడవలసిన బాధ్యత దేవేంద్రుడి మీద పడ్డది. దేవేంద్రుడి ఉద్యోగమే అది. ఈ రహస్యం గ్రహించమని కువిమర్శకులు ఆయనను అసూయాపరుడిగా చిత్రీకరిస్తూ వుంటారు. ఆ చిత్రణకు ఈ కథలో అవకాశం లేదు. ఎందుకంటే, దేవేంద్రుడు నాయికా నాయకులను పరీక్షించినాక, తృప్తిపడి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కదా!
ఆమె తండ్రి పేరు భీముడు. (అంతశ్శతువులకు భయంకరుడు) ఇతడి గురువు దమమహర్షి దమము అంటే, సర్వేంద్రియ నిగ్రహం.) ఆ మహర్షి వరంవల్ల పుట్టిన పిల్లల పేర్లు దమయంతి, దముడు, దాంతుడు, దమనుడు. కాగా, ఈ వంశమంతా ఇంద్రియ నిగ్రహంతోనూ, యాగయోగాది సత్కర్మాచరణంతోనూ, నిండి వున్నదని మహర్షి సూచిస్తున్నాడు.
(బంధించేవాడు నలుడు, బంధింపబడేవాడు నలుడు) అనేవి రెండు నిర్వచనాలు.
‘‘నలం’’అనే శబ్దానికి ఛిద్రము, లేక రంధ్రము అని అర్థం. దీని మీద నుంచీనే నాళము, నాళిక, ప్రణాళిక వంటి శబ్దాలు ఉత్పన్నమయినాయి. వీటన్నింటిలోనూ వ్యుత్పత్తిపైన చెప్పుకొన్నదే.
ఈ నిర్వచనాలన్నీ నలమహారాజుకు ఎలా అన్వయిస్తాయో చూద్దాం.
ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నామంటే, నలుడు నిషధ దేశరాజు. ఈ రాజ్యానికి ప్రారంభకుడు నిషాదుడు. ఇతడు వేనచక్రవర్తి ఎడమ భుజంలోంచి జన్మించిన అల్పసారుడు- అని భాగవతం చెపుతోంది. దాన్నిబట్టి ఈ కాలనిర్ణయం చేయగలుగుతున్నాం.
కనుక, మనమిప్పుడు కృతయుగంనాటి నలచరిత్రలోని దేవరహస్యాలను తెలుసుకునే ప్రయత్నంచేయాలి. ఇందుకోసం మనకు తోచిన విధానాలను కాకుండా, వ్యాసమహర్షి సూచించిన విధానాలనే అనుసరించటం ఎక్కువ ఉపయోగకరం.
వచ్చిన పెద్దమనిషితో ధర్మరాజు తన కష్టాలు చెప్పుకోగా, ఆ మహర్షి నవ్వి, ‘‘నలమహారాజు నీకంటే ఎక్కువ కష్టాలు పడ్డాడయ్యా. అతడు అశ్వహృదయ విద్య తెలిసిన వాడైనా కూడా, కలిదోషానికి పాలై, అక్షహృదయాన్ని కూడా సంపాదించి, ఈ రెండు విద్యల బలంవల్ల కలి సంహారకుడయ్యాడు’’అంటూ మొదలుపెట్టి, నలచరిత్ర అంతా వివరించి, చివరిగా ‘‘కర్కోటకస్య నాగస్య’’అనే కలిదోష నివారక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు.
సగం చీర చింపి భర్తకు ఇచ్చింది. భర్త తనను మోసగించి పారిపోతే, మళ్ళీ భర్త దొరికే దాకా అదే సగం చీరతో జీవితం గడిపింది. ఇంత గొప్ప పాతివ్రత్యదీక్ష పురాణ వనితల్లో ఈమెకు తప్ప మరొకరికి లేదేమో! అందుకనే కొందరు ఈమెను సాక్షాత్తుగా మహాత్రిపుర సుందరీదేవి అన్నారు.