S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాఖపట్నం, జనవరి 23: విశాఖ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మం, జనవరి 23: గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని జరుగుతున్న ఆటల పోటీల్లో అపృశృతి చోటు చేసుకుంది. ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా జూలూరుపాడులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం జూలూరుపాడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఖోఖో ఆడుతుండగా ఇద్దరు తోటి ఆటగాళ్లు బలంగా తగలడంతో 7వ తరగతి విద్యార్థి భద్రాచలం స్పృహ తప్పి పడిపోయాడు.
రాజమహేంద్రవరం, జనవరి 23: ఇసుక రీచ్ల వేలంలో పాల్గొనేందుకు వ్యాట్ రిజిస్ట్రేషన్ అడ్డంకిగా మారింది. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన కొత్త ఇసుక వేలం విధానంలో వ్యాట్ రిజిస్ట్రేషన్ లేకుండా టెండర్లు దాఖలుచేయటానికి కుదరదు. వ్యాట్ రిజిస్ట్రేషన్ ద్వారా లభించిన టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్(టిన్ నంబర్) లేకుండా ఇసుక రీచ్ల వేలంలో పాల్గొనేందుకు సాధ్యంకాదు.
గుంటూరు, జనవరి 23: రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని, వారంతా ఇచ్చిన సూచనలను తప్పక పరిగణనలోకి తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సిఆర్డిఎ వైస్ చైర్మన్ పి నారాయణ స్పష్టం చేశారు. సిఆర్డిఎ కమిషనర్ శ్రీకాంత్తో కలిసి సింగపూర్లో రెండు రోజుల పర్యటనను శనివారం ఉదయం ప్రారంభించిన సందర్భంగా మంత్రి నారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు.
రాజమహేంద్రవరం, జనవరి 23: చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని శనివారం పోలీసులు అరెస్టు చేసి, ఇక్కడ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది వైఎస్సార్ సిపి ఇచ్చిన బంద్ సందర్భంగా వైఎస్సార్ సిపి కార్యకర్తలు ప్రకాష్నగర్ పోలీసుస్టేషన్పై దాడి చేసి, ఎస్ఐని గాయపరిచారు.
రేణిగుంట, జనవరి 23: పట్టణం నడిబొడ్డున ఎన్టిఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఎస్బిఐ ఏటిఎంలో 15.80లక్షల రూపాయలు మాయం అయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈసంఘటనలో అనుమానం ఉన్న అక్కడ పని చేసే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఎస్బిఐ ఏటిఎంలో గత శనివారం ఉదయం సంబంధిత సిబ్బంది 20 లక్షల రూపాయలు నగదును ఉంచారు.
విశాఖపట్నం, జనవరి 23: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇఎస్) అమల్లో ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ఉపాధి పథకం అమల్లో పారదర్శకత, జవాబుదారీ తనంతో పాటు కూలీలకు సక్రమంగా వేతనాల చెల్లింపు, తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు సంతృప్తి చెందిన కేంద్రం జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసింది.
కాకినాడ, జనవరి 23: కాపులను ఉద్దరిస్తామంటూ త్వరలో కాపు గర్జనలు నిర్వహిస్తున్న నేతల వెంట ఎవరూ వెళ్లవద్దని తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు కోరారు. కాకినాడలో జరిగిన టిడిపి సమావేశంలో నామన మాట్లాడుతూ కాపులకు చంద్రబాబు ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందన్నారు.
విశాఖపట్నం, జనవరి 23: కాపులను వెనుకబడిన వర్గాల్లో చేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. విశాఖ జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో నగరంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో దివంగత నేత కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులను వెనుకబడిన వర్గాల్లో చేర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
దర్శి, జనవరి 23 : తినుబండారాలు కొనుక్కోవడానికి పాఠశాల నుండి బయటకు వెళ్లిన విద్యార్థిని కరస్పాండెంట్ కిరాతకంగా చితకబాదిన సంఘటన శనివారం ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో చోటుచేసుకుంది. గౌతమీ గ్రామర్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న వెదురు శ్రీనివాసరెడ్డి సాయంత్రం స్టడీ అవర్లో రెండవ బెల్కొట్టడంతో పక్కనే ఉన్న బడ్డీకొట్టులో బోండాలు కొనుక్కోవడానికి బయటకు వెళ్లాడు.