S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 01:41

త్రిసూర్, జనవరి 21: సెక్యురిటీ గార్డు హత్యకేసులో కేరళకు చెందిన బీడీ వ్యాపారి మహ్మద్ నషామ్‌కు కోర్టు 39 ఏళ్ల జైలుశిక్ష విధించింది. బీడీ బరాన్‌గా పిలిచే నషామ్ తన లగ్జరీకారుతో వాచ్‌మెన్‌ను ఢీకొట్టి మృతికి కారణమయ్యాడు. కేసుసు విచారించిన మొదటి అదనపుజిల్లా, సెషన్స్ న్యాయమూర్తి కెపి సుధీర్ 40 ఏళ్ల బీడీ బరాన్‌కు ఏకంగా 39 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు.

01/22/2016 - 02:35

అహ్మదాబాద్, జనవరి 21: ప్రసిద్ధ శాస్ర్తియ నృత్య కళాకారిణి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మృణాళిని సారాభాయ్ (97) గురువారం ఉదయం కన్నుమూశారు. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాల పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ సతీమణే మృణాళిని. వయోభారంతో అస్వస్థతకు గురైన మృణాళిని బుధవారం నగరంలోని ఓ ఆసుప్రతిలో చేరారు. ఆసుపత్రిలోనే గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

01/22/2016 - 01:39

న్యూఢిల్లీ, జనవరి 21: ఈ ఏడాది ఏప్రిల్ నాటికల్లా తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడం జరుగుతుందని కేంద్ర ఆహార మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ గురువారం చెప్పారు. ఇప్పటివరకు 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని అమలు చేశాయని, మరో 11 రాష్ట్రాలు అమలు చేసే ప్రక్రియలో ఉన్నాయని ఆయన చెప్పారు.

01/22/2016 - 01:26

హైదరాబాద్, జనవరి 21: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీ మినహా కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ, బిజెపిల్లో ఆగ్రహాజ్వాలలు రగిల్చింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన గురువారం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతో పార్టీ కార్యాలయాలు అట్టుడుకాయి. టిక్కెట్లు రాని ఆశావాహులు ఆందోళనలకు దిగి నేతలపై కనె్నర్ర చేశారు.

01/22/2016 - 01:25

న్యూఢిల్లీ, జనవరి 21: గణతంత్ర దినోత్సవ వేడుకలకు కనీవినీ ఎరుగని భద్రత కల్పిస్తున్నారు. 67వ రిపబ్లిక్‌డే వేడుకలను భగ్నం చేయడానికి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ కుట్రపన్నిందన్న ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో పూర్తి అప్రమత్తత పాటిస్తున్నారు.

01/22/2016 - 01:30

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనపై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ దిగివచ్చింది. గురువారం నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు పాలక మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది.

01/22/2016 - 01:23

పఠాన్‌కోట్‌లోని వైమానిక కేంద్రంపై జరిగిన దాడికి సంబంధించి కుట్రపన్నిన వారిపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవల్సిందేనని భారత్ తెగేసి చెప్పింది. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్‌లో జరుగుతున్న దర్యాప్తు తీరును తాము లోతుగా పరిశీలిస్తున్నామని విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం ఇక్కడ స్పష్టం చేశారు.

01/22/2016 - 01:21

హైదరాబాద్, జనవరి 21: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రధాన సమస్యగా మారిన గోదావరి జలాల వినియోగంపై గురువారం హైదరాబాద్‌లో జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాడిగా, వేడిగా జరిగింది. బోర్డు చైర్మన్ రామ్‌శరణ్ అధ్యక్షతన జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాలు తమకున్న హక్కులు, అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.

01/22/2016 - 01:20

తారాగణం:
శర్వానంద్, సురభి, బ్రహ్మాజీ, సప్తగిరి, ధన్‌రాజు, సుప్రీత్, ప్రభాస్‌శీను, ఊర్వశి తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
నిర్మాతలు:
వంశీ, ప్రమోద్
దర్శకత్వం:
మేర్లపాక గాంధీ

01/22/2016 - 01:18

హైదరాబాద్, జనవరి 21: రక్షణ రంగ ఉత్పత్తులు, విమానయాన రంగానికి సంబంధించి ఉత్పత్తులు చేస్తున్న లాక్‌హీడ్ కంపెనీ విభాగాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దావోస్ పర్యటన సందర్భంగా మూడో రోజు పలువురు ప్రముఖులు, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.

Pages