S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/13/2019 - 04:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి రామ్‌మందిర్, అయోధ్యలోని వివాదాస్పద స్థలం మాదిరిగానే అత్యున్నత న్యాయస్థానం కూడా ‘మాదే’ అని చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది.

09/13/2019 - 03:35

ఎ కొండూరు, సెప్టెంబర్ 12: మండలంలోని ఎ కొండూరు చైతన్యనగర్ తండాకు చెందిన బాణావతు నాగరాజు రజిని కుమారుడు బాణావతు శ్రీనివాసరావు (6) జ్వరం సోకడంతో ఈ నెల 9వ తేదీ నుండి కంభంపాడు ఆర్‌ఎంపీ ఆర్‌ఎంపీ డాక్టర్ చలపతిరావు వద్ద వైద్యం చేయిస్తుండగా జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో అధిక మోతాదులో మాత్రలు ఇవ్వడం వల్ల అవి వికటించి అపస్మారక స్థితిలో ఉండగా బాధిత తల్లిదండ్రులు మైలవరం ప్రేవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్

09/13/2019 - 03:35

మచిలీపట్నం, సెప్టెంబర్ 12: తన కుమారుడిని ఎలాగైనా ఎంబీబీఎస్ చేయించాలన్న ఆ తండ్రి అత్యాశ దుఃఖానికి దారి తీసింది. తన కుమారుడు నీట్‌లో క్వాలీఫై కాకపోయినా గుర్తుతెలియని వ్యక్తి మాటలు విని ఎంబీబీఎస్ సీటు కోసం రూ.15లక్షలు ఆన్‌లైన్ పేమెంట్ చేసి బోల్తా పడ్డాడు.

09/12/2019 - 22:31

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: బిహార్‌లోని ముజఫర్‌పూర్ షెల్టర్ హోంకు చెందిన 44 మంది బాలికల్లో ఎనిమిది మంది తిరిగి వారి కుటుంబాలతో కలవడానికి సుప్రీంకోర్టు గురువారం అనుమతించింది. ఈ ఎనిమిది మంది బాలికలకు అవసరమయిన అన్ని ఆర్థిక, వైద్య సహాయాలను అందించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

09/12/2019 - 05:24

హైదరాబాద్ : స్కూల్ ఫీజులకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై తుది తీర్పును నవంబర్‌లో వెలువరించనున్నట్టు బుధవారం నాడు రాష్ట్ర హైకోర్టు సూచించింది. హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన స్కూలు ఫీజుల పిటిషన్ల విచారణ తుది దశకు చేరుకుంది. స్కూల్ ఫీజులకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లలో హెచ్‌ఎస్‌పీఏ ఇంప్లీడ్ అయ్యింది.

09/12/2019 - 02:45

నేరేడ్‌మెట్, సెప్టెంబర్ 11: బంగారు దుకాణాలు, ఇంటి తాళాలు పగుల గోట్టి దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 11 లక్షల రూపాయల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్న సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగింది. బుధవారం నేరేడ్‌మెట్ రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు.

09/11/2019 - 23:48

రాయపర్తి, సెప్టెంబర్ 11: ఫేస్ బుక్‌లో పరిచయమైన ఓ యువకుడు రెండు లక్షల విలువ చేసే తన కేటీఎం ఆర్సీ 200 సీసీ గల బైక్‌ను 80 వేలకే అమ్ముతున్నానని చెప్పడంతో నమ్మిన మరో యువకుడు ఆన్‌లైన్ ద్వారా 50 వేలు చెల్లించి మోసపోయన సంఘటన రాయపర్తి మండలంలోని మైలారం శివారు చక్రుతండాలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు తనకు జరిగిన మోసాన్ని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

09/12/2019 - 05:23

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం బెయిల్ కోసం బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనను 14 రోజులు జుడీషియల్ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. చిదంబరంను ఈనెల 19 వరకూ జుడీషియల్ కస్టడీకి పంపుతూ సెప్టెంబర్ 9న ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది.

09/11/2019 - 23:16

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: బీజేపీ సీనియర్ నేత చిన్మయానంద తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ యూపీకి చెందిన ఒక మహిళ, ఇందుకు అవసరమైన సాక్ష్యాధారాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయని స్పష్టం చేసింది. తన స్నేహితురాలు దానిని ఇప్పటికే పోలీసులకు అప్పగించిందని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

09/11/2019 - 04:38

నిర్మల్, సెప్టెంబర్ 10: డివైడర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డ సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ నుండి నిర్మల్‌కు బయలుదేరిన ఏపి 01 టిఎ 1008 నంబరు గల ఆర్టీసీ బస్సు నిర్మల్ శివారులోని గంజాల్ టోల్‌గేట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో డివైడర్‌ను ఢీకొట్టింది.

Pages