S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/16/2019 - 04:48

జీడిమెట్ల, ఏప్రిల్ 15: ఈతకు వెళ్లిన ఓ బాలుడు క్వారీ కుంటలో మునిగి మృతి చెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సుభాష్‌నగర్‌లో నివాసముండే జే.చిన్నారావు కూలి పని చేస్తుంటాడు. చిన్నారావు ఈనెల 9న కాకినాడకు ఓటు వేసేందుకు వెళ్లి తిరిగి సోమవారం ఇంటికి వచ్చాడు. చిన్నారావు కుమారుడు ఆనంద్ (15) ఇంట్లోనే ఉన్నాడు. ఊరు నుంచి వచ్చిన చిన్నారావుకు ఆనంద్ కనిపించలేదు.

04/16/2019 - 04:46

వనస్థలిపురం, ఏప్రిల్ 15: పార్టీ ఉందని ఇంటికి పిలిచారు. తాగిన మత్తులో ఎనిమిది మంది యువకులు వివాహితపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం నగరంలోని కొత్తపేట్ గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న 32ఏళ్ల వివాహిత తన భర్తతో ఉన్న విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది.

04/16/2019 - 04:43

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలవరం ఎస్సై సిహెచ్ రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం స్పిల్‌వేలో సెంటరింగ్ పనులు చేయడానికి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన భీమలేస్ కుమార్‌రామ్ (22) 32వ బ్లాకు వద్ద ఉండగా ఇనుప నిచ్చెన తీసుకెళుతున్న ట్రాలీపై నుండి పడడంతో తలకు బలమైన గాయమైంది.

04/15/2019 - 22:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు సోమవారంనాడు నోటీసు జారీ చేసింది. రాఫెల్ వివాదంపై సుప్రీంకోర్టు ఎన్నడూ చేయని వ్యాఖ్యలను రాహుల్ చేశారని, తన సొంత మాటలను ఆపాదిస్తూ సర్వోన్నత న్యాయస్థానంపై వ్యాఖ్యలు చేసినందుకుగాను దీనిని తీవ్రంగా పరిగణించింది.

04/15/2019 - 22:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై రూపొందిన బయోపిక్ చిత్రం విడుదలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. మోదీ బయోపిక్‌ను సంపూర్ణంగా చూసి, నిర్ణయాన్ని ఈ నెల 19వ తేదీలోగా సీల్డు కవర్‌లో అందజేయాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను (ఈసీ) ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ మోదీ బయోపిక్ విడుదల కాకుండా ఇసీ నిషేధించిన సంగతి తెలిసిందే.

04/15/2019 - 04:51

బనగానపల్లె, ఏప్రిల్ 14 : కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండల తహశీల్దార్‌గా పని చేస్తున్న ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం అనంతరంపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాలు.. విష్ణువర్ధన్‌రెడ్డిది అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని గోవిందరావుపేట. ఈయన అనంతపురం జిల్లా సోమందేపల్లె తహశీల్దార్‌గా పనిచేస్తూ ఎన్నికల సమయంలో బదిలీపై బనగానపల్లెకు వచ్చారు.

04/15/2019 - 04:37

ప్రత్తిపాడు, ఏప్రిల్ 14: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఆర్మీ కల్నల్ వినీత్ అగర్వాల్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రత్తిపాడు ఎస్సై బాలాజీ అందించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాయబరేలీకి చెందిన కల్నల్ వినీత్ అగర్వాల్‌కు కోల్‌కత్తాకు బదిలీ కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు కారులో బయలుదేరారు.

04/15/2019 - 01:38

కోదాడ, ఏప్రిల్ 14: కోదాడ ఖమ్మం క్రాస్‌రోడ్డులో ఘోర ప్రమాదం సంభవించింది. పండగపూట చోటు చేసుకున్న ఈ విషాదం అందరినీ కదిలించివేసింది. రెండవ భద్రాద్రిగా పిలువబడే తమ్మరబండపాలెంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించి ఆటోలో ఇంటికి తిరుగుపయనమైన తొమ్మిది మంది ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని ప్రమాదానికి గురయ్యారు. ఆటోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఒకరు మార్గమధ్యంలో మృతి చెందారు.

04/15/2019 - 00:38

ఖైరతాబాద్, ఏప్రిల్ 14: తన ప్రేమను అంగీకరించడం లేదనే అక్కసుతో యువతి, ఆమె తల్లిపై దాడి చేసిన ఓ యువకుడు అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి తన స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

04/15/2019 - 00:33

జీడిమెట్ల, ఏప్రిల్ 14: సూరారం కాలనీలోని మురికికాలువలో ప్యాక్ చేసి ఉన్న లగేజీ బ్యాగ్‌లో మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రామచంద్రాపురం ఎల్‌ఐజీ కాలనీలో నివాసముండే శ్రీనివాస రావు కుమార్తె లావణ్య(25) టీసీఎస్ ఉద్యోగిని. సూరారం కాలనీ, సుందర్ నగర్‌లో నివాసముండే సునీల్ కుమార్(25) జూబ్లీహిల్స్‌లోని మోల్డ్‌టెక్‌లో పనిచేస్తాడు.

Pages