-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఖైరతాబాద్, ఏప్రిల్ 14: అతివేగంగా అదుపు తప్పి వచ్చిన ఓ కారు డివైడర్ను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఆదివారం సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలోని రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. నగరానికి చెందిన ఓ కుటుంబం తమ కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది.
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: సుమశ్రీ మృతి కేసు మళ్లీ తెర పైకి వచ్చింది. మాజీ భర్త మాదంశెట్టి శివకుమార్ తనకు అన్యాయం చేయడంతో పాటు కుమార్తె సాయిశ్రీ మరణానికి కారకుడయ్యాడని, ఈ వ్యవహారంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రమేయం ఉందని ముందునుంచీ ఆరోపిస్తూ వస్తున్న సుమశ్రీ తాజాగా హైకోర్టును ఆశ్రయించటంతో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సూర్యారావుపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
పామర్రు, ఏప్రిల్ 13: స్థానిక కొత్త పెదమద్దాలి వద్ద పామర్రు, గుడివాడ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆ ప్రాంతానికి చెందిన ఇటుకరాయి కార్మికులు నల్లూరి నాగేశ్వరరావు(61), భార్య పైడమ్మ(56) దంపతులు దుర్మరణం చెందారు. ఏపీ 16 డబ్ల్యు 6797 నెంబరు గల లారీ ఢీకొనగా వీరు మృతి చెందారు.
షాబాద్, ఏప్రిల్ 13: కారు బోల్తా ఘటనలో చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది. షాబాద్ ఎస్సై రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం కారు బోల్తా పడిన సంఘటనలో షాబాద్ గ్రామానికి చెందిన దొండ్ర శ్రీనివాస్ (రాము) పెద్ద కూతురు శ్రద్దాక్షి(3) తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
కీసర, ఏప్రిల్ 13: ఈవీఎంలు భద్రపరిచిన స్రాంగ్రూంలో ఫొటోలు దిగిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
హైదరాబాద్: రాయదుర్గం పరిధి చిత్రపురి కాలనీ ఎల్ఐజీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న హిందూశ్రీ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్మెంట్లోని నాలుగవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని గాంధీ అసుపత్రికి తరలించారు.
గుడివాడ, ఏప్రిల్ 12: గుడివాడ 19వ వార్డు టీడీపీ కౌన్సిలర్ నండూరి ప్రసాద్ కారు ఢీకొని గర్భిణీ మృతి చెందగా, ఆమె భర్త, కుమార్తె తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
వికారాబాద్, ఏప్రిల్ 12: పొలంలో మేక మేత మేసిందని ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన ధారూరు పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారూరు మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన బుద్ద నరేశ్(21), అదే గ్రామానికి చెందిన అశోక్ పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం నరేశ్ తనకున్న ఎద్దులను, మేకను మేత మేపేందుకు పొలానికి వెళ్లాడు.
వికారాబాద్, ఏప్రిల్ 12: నాడు ప్రేమించానని వెంటపడ్డాడు. చివరకు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. ఓ సంవత్సరం పాటు కాపురం కూడా చేశాడు. మోజు తీరాక గుట్టు చప్పుడు కాకుండా వదిలేశాడు. ఎలాగైనా తన ప్రియుడి కళ్లు తెరిపించి తన సొంతం చేసుకోవాలని సంకల్పంతో ప్రియుడి ఇంటి ముందు వౌన దీక్ష చేపట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆచరయోగ్యం కాని షరతులు విధించటం వల్లనే ఢిల్లీలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చేసుకోలేకోయామని కాంగ్రెస్ వెల్లడించింది. కాబట్టి ఢిల్లీలోని ఏడు సీట్లల్లో సొంతంగానే పోటీ చేస్తుందని ఢిల్లీ ఇంచార్జ్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పీసీ చాకో ప్రకటించారు.