-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావమరిది రాబర్ట్ వాద్రా సంస్థకు చెందిన రూ.4.62 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. బికనీర్ భూ కుంభకోణానికి సంబంధించి ఈ ఆస్తులను జప్తు చేశారు. ఇందులో రూ. 18.59 లక్షల విలువ చేసే చరాస్థులు, రూ.4.43 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ఈడీ అధికారులు చెప్పారు.
హైదరాబాద్, పిబ్రవరి 15: ఏన్నారై చిగురిపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్రెడ్డి పూటకోమాట చెబుతూ కేసుపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాడు. జయరాం హత్యపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న అధికారులను సైతం ఈ కేసు గందరగోళంలోకి నెడుతోంది. తనను వదిలేస్తే రూ. 10 కోట్లు ఇస్తానని జయరాం బతిమాలగా లేదులేదు నిన్ను చంపితే రూ.
తడ, ఫిబ్రవరి 15: ‘వేట’ అనే పేరుతో ఓ ముఠాగా ఏర్పడి గంజాయి సేవిస్తూ ప్రతి నిత్యం అక్రమ సంబంధాలు కలిగిన జంటలపై దాడులు చేస్తూ వారినుంచి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటూ సదరు మహిళలపై అఘాయిత్యం చేస్తున్న ముఠాను సూళ్లూరుపేట సీ ఐ యన్ కిషోర్బాబు, తడ ఎస్సై దాసరి వెంకటేశ్వర్లు చాకచక్యంగా శుక్రవారం పట్టుకున్నారు. వీరి నుంచి 5 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కొంతమంది న్యాయవాదులు లోపభూయిష్టమయిన పిటిషన్లు దాఖలు చేస్తూ మీడియాలో విస్తృత ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు శుక్రవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం రాఫెల్ కేసులో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలయిన రివ్యూ పిటిషన్లను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
చౌటుప్పల్, ఫిబ్రవరి 14: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం, లింగోజిగూడెం గ్రామ శివారులోని ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ లేబోరేటరీస్ లిమిటెడ్ పరిశ్రమలో గురువారం ఐటీ దాడులు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని దివీస్ పరిశ్రమలు, కార్యాలయాలపై ఏక కాలంలో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.
పాతబస్తీ, ఫిబ్రవరి 14: షాపు యజమాని టిన్ నెంబర్తో సరుకును తెప్పించి అమ్ముకున్న కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తపేట పోలీసుల కథనం ప్రకారం రాజస్తాన్కి చెందిన భావేష్ (22) ఐదేళ్ల క్రితం విజయవాడకు వలస వచ్చాడు. అంతకు ముందే అతని అన్న విజయవాడ పాతబస్తీలోని ఎలక్ట్రికల్ షాపులో పని చేస్తుండగా భావేష్ కూడా మరో ఎలక్ట్రికల్ షాపులో గుమస్తాగా చేరాడు.
నాగాయలంక, ఫిబ్రవరి 14: మండల పరిధిలోని భావదేవరపల్లిలో గురువారం విద్యుదాఘాతంతో విజయవాడకు చెందిన అప్పల నరసింహారావు (59) మరణించారని ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించి పలు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్, సయ్యద్ సుజా అనే సైబర్ నిపుణుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసు కమిషనర్ ఆదేశాలతో నారాయణగూడ పోలీసు స్టేషన్లో వారిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైందని బీజేపీ ఎంఎల్సీ ఎన్ రామచందర్రావు తెలిపారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారని గురువారం నాడు చెప్పారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఢిల్లీ ప్రభుత్వ అధికారాల వికేంద్రీకరణ, పంపిణీ అంశంపై విచారణ చేపట్టే బాధ్యతను విస్తృత రాజ్యాం గ ధర్మాసనానికి నివేదిస్తూ, సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించి కాగా కొన్ని అంశాలపై అధికారాలను పంపిణీ చేస్తున్నట్లు కోర్టు తీర్పులో పేర్కొంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన కృష్ణా నది జలాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ట్రిబ్యునల్ ముందుకు గురువారం తెలంగాణ తరఫుసాక్షిగా ఉన్న పళనిస్వామిని ఆంధ్రప్రదేశ్ తరపు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.