-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, ఫిబ్రవరి 11: సంచలనం సృష్టించిన కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసుకు సంబంధించి త్వరలో శిఖా చౌదరికి పోలీసులు నోటీలు జారీచేసి విచారణ చేసే అవకాశం ఉంది. జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పనిమనిషి, వాచ్మన్, స్నేహితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. శిఖా చౌదరి, జయరాం మధ్య ఉన్న సంబందాలపై విచారించినట్లు తెలిసింది.
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలోని గోద్రాలో 2002లో జరిగిన అల్లర్లతో సంబంధమున్న అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీకి, పలువురు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ను జూలైలో విచారిస్తామని సుప్రీం కోర్టు సోమవారం తెలియజేసింది. 2002, ఫిబ్రవరి 28న గుజరాత్లోని గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ ఎస్-6 కోచ్ను కొందరు దుండగులు దగ్ధం చేయడంతో 59 మంది సజీవ దహనమయ్యారు.
ఖైరతాబాద్, ఫిబ్రవరి 10: బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు సూర్యతేజ పంజాగుట్ట పోలీసులకు శనివారం అర్ధరాత్రి లొంగిపోయాడు. సూర్యతేజను పట్టుకోవడానికి శనివారం పోలీస్ బృందాలు ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే అతనే స్వయంగా పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. నటి ఝాన్సీ ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడకు చెందిన సూర్యతేజ పలు ఆశక్తికర వివరాలును పోలీసులుకు వివరించినట్లు తెల్సింది.
ఘట్కేసర్, ఫిబ్రవరి 10: భార్య, కుమారుడిని చంపి పెట్రోల్ పోసి నిప్పంటించి తగులబెట్టిన సంఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధి కొండాపూర్ గ్రామంలో ఆదివారం సంచలనం సృష్టించింది. సంఘటన వివరాలు ఘట్కేసర్ పోలీసుల కథనం ఇలా ఉన్నాయి.
వరంగల్ క్రైం, ఫిబ్రవరి 10: కామంతో కళ్లు మూసుకుపోయిన కామందుల అత్యాచారాలు, పైశాచిక చర్యలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి... చట్టాలు ఎన్ని ఉన్నా కామాందులు వాటిని లెక్క చేయకుండా పైశాచికంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.
షిల్లాంగ్, ఫిబ్రవరి 10: శారద చిట్ఫండ్ స్కాంలో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. వివాదస్పద కోల్కొతా పోలీసు కమిషనర్ రాజీవ్కుమార్, టీఎంసీ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ను సీబీఐ పోలీసులు ఇక్కడ రెండవ రోజు విచారించారు. ఈ సందర్భంగా అనేక కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. శనివారం దాదాపు 9 గంటల సేపు రాజీవ్ కుమార్ను సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసులో ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది.
కోల్కతా, ఫిబ్రవరి 10: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్యకేసులో బీజేపీ నేత ముకుల్ రాయ్ సహా నలుగురిపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ముకుల్ రాయ్ గతంలో టీఎంసీ తరఫున ఎంపీగా పనిచేసి, సీఎం మమతా బెనర్జీతో వచ్చిన విభేదాల వల్ల బీజీపీలో చేరారు.
కూచిపూడి, ఫిబ్రవరి 10: మనస్థాపం చెంది పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూరసాని మాలపల్లిలో చోటు చేసుకుందని కూచిపూడి ఎస్ఐ దుర్గామహేశ్వరరావు ఆదివారం తెలిపారు. మొవ్వ మండలం సూరసాని మాలపల్లికి చెందిన ము వ్వల లక్ష్మయ్య కుమారుడు జానీ (17) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
జీడిమెట్ల, ఫిబ్రవరి 10: ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. అల్వాల్లో నివాసముండే సూరకంటి విజయభాస్కర్ (50) ప్రభుత్వ ఉద్యోగి. ఇతని కుమార్తె సూరకంటి సహానా (16) బాచుపల్లిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది. ఈ నెల 9న విజయభాస్కర్ సహానాను శ్రీ చైతన్య కాలేజీ వద్ద డ్రాప్ చేశాడు.
ఉప్పల్, ఫిబ్రవరి 10: బోడుప్పల్ చౌరస్తాలో ఆదివారం టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. స్థానిక టీడీపీ, కాంగ్రెస్ ఎంపీటీసీలు, నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాలను వీడియో ద్వారా కవర్ చేయడానికి చౌరస్తాలో సభ, ర్యాలీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన నిషేద డ్రోన్ కెమెరా ప్రత్యక్షమైంది. కోర్టు ఆదేశాల ప్రకారం డ్రోన్ కెమెరా వాడటం నిషేధం.