-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మచిలీపట్నం, ఫిబ్రవరి 12: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తొమ్మిదవ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి మంగళవారం తీర్పు ఇచ్చారు. చల్లపల్లి మండలం రామానగరం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన మట్టా దిలీప్ కుమార్ (23) పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంటి వద్దనే తల్లిదండ్రులతో జీవిస్తున్నాడు. దిలీప్ చిన్న తనంలోనే తల్లి మృతి చెందగా తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడు.
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 12: అతివేగంగా దూసుకువచ్చిన లారీ అదుపుతప్పి మూడు కార్లను ఢీకొట్టిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారు మైలార్దేవ్పల్లిలో అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకువచ్చిన లారీ అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న మూడు కార్లను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
మహేశ్వరం, ఫిబ్రవరి 12: పింఛన్, అధిక వడ్డీ ఆశగా చూపి అమాయక గ్రామీణ ప్రజల్ని నమ్మించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మూడు వందల మందిని బురిడీ కొట్టించిన వారిని జైలుకు తరలించారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన సెంథిల్ కుమార్, తులసి మండల కేంద్రంలోని సయ్యద్ అన్వర్ ఇంట్లో సినర్జీలైఫ్ పేరుతో నాలుగేళ్ల క్రితం కార్యాలయాన్ని ప్రారంభించారు. తమవద్ద రికరింగ్ డిపాజిట్గా రూ.
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 12: ఆడుకుంటూ ఓ విద్యుత్ స్తంభాన్ని పట్టుకొని బాలుడు మృత్యువాతపడ్డ సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పీరంచెరువు సమీపంలో పెబెల్ సిటీలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన దివాకర్ భార్య, కుమారుడు వౌనీష్తో కలిసి ఉంటున్నాడు. దివాకర్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కోర్టు ధిక్కారం కేసులో సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ మనె్నం నాగేశ్వరరావు, న్యాయ సలహాదారు ఎస్ బాసరంను కోర్టు పనివేళలు పూర్తయ్యే వరకు కోర్టు రూంలో కూర్చోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఒక లక్ష రూపాయల జరిమానాను విధించింది.
ఆత్మకూరు, ఫిబ్రవరి 12: మండల పరిధిలోని తోపుదుర్తి సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ధనుంజయను చికిత్స కోసం మంగళవారం బెంగళూరు తరలించగా ఆసుపత్రిలోకి వెళ్ళగానే మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టరం నిర్వహించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన మరో యువకుడు ఓబుళరెడ్డిని కర్నూలు ఆసుపత్రికి తరలించారని తెలిపారు.
ఉరవకొండ, ఫిబ్రవరి 12 : పట్టణ శివారు ప్రాంతంలో డ్రైవర్స్ కాలనీ వద్ద మంగళవారం 42 జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చి కారు ఢీకొనడంతో విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న కుళ్లాయప్ప కుమారుడు కార్తీక్ (8) స్థానిక లక్ష్మీనరసింహ కాలనీలోని యూపీ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు.
కురుపాం, ఫిబ్రవరి 12: ఇటీవల తప్పిపోయిన బాలికను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించామని కురుపాం ఎస్ఐ పి దినకర్ తెలిపారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంజరాపు కావ్య ఇటీవల కనిపించకుండా పోయిందని, దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేశామన్నారు. ఈమేరకు సింహాచలంలో బాలికను పట్టుకుని కురుపాం తీసుకువచ్చిన తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 12: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన జి.పాపయ్య(56) మంగళవారం విద్యుత్తుషాక్కు గురై మృతి చెందాడు. ఆయన ఇంటికి వున్న సర్వీసువైరు తెగి దానికి అనుకొని వున్న జీయా వైరు పెరటి కిటికీకి తగలడంతో పాపయ్య కిటికీ పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనితో పాపయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతదేహానికి శవపంచానామా నిర్వహించారు.
ఘట్కేసర్, ఫిబ్రవరి 11: పథకం ప్రకారమే కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కడతేర్చి హతమార్చినట్లు మల్కాజిగిరి ఇన్చార్జి డీసీపీ ఎన్.దివ్యచరణ్రావు తెలిపారు. ఘట్కేసర్ పోలీసు స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శుశ్రుత హత్య కేసు వివరాలు వెల్లడించారు.