-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ముంబయి, నవంబర్ 8: లాటరీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ పరిధిలోకి వస్తుందని ముంబయి హైకోర్టు ప్రకటించింది. రాష్ట్రంలో లాటరీ అమ్మకాలపై మహారాష్ట్రప్రభుత్వం పన్నులను విధించడాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర పన్నులు, లాటరీ చట్టం 2006ను సవాలు చేస్తూ మంగళ్ మూర్తి మార్కెటింగ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
ఉప్పల్, నవంబర్ 8: దీపావళి పండుగ సందర్భంగా బుధవారం బోడుప్పల్ హేమానగర్లో ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణంలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన ఘటనతో దుకాణంలో టపాసులు పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. అదే సమయంలో అక్కడే ఉన్న జనం భయంతో సురక్ష ప్రాంతానికి పరుగులు తీశారు. అందిన సమాచారం ప్రకారం..
హైదరాబాద్: తనపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను స్వతంత్ర సంస్థలతో చేయించాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఉమ్మడి హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. పిటిషన్ల విచారణ అర్హతపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని హైకోర్టు తెలిపింది.
నంద్యాల, నవంబర్ 8: ఏకంగా మూడు కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టాడు చిరుద్యోగి అయిన జేజి బాబు. ఆయన ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. ఏకకాలంలో మూడుచోట్ల సోదాలు జరిగిన అధికారులు పెద్దమొత్తంలో బంగారం, వెండి, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామ వీఆర్ఓ జేజి బాబు అక్రమాస్తుల చిట్టా ఇది.
చక్రాయపేట, నవంబర్ 8: దేశంలో ప్రవేశించిన స్వైన్ఫ్లూ వ్యాధి పొరుగున ఉన్న కర్నూలు జిల్లా నుండి కడప జిల్లాకు సోకింది. ఫలితంగా ఆ వ్యాధితో స్వైన్ఫ్లూతో చక్రాయపేట మండలం నెరుసుపల్లె గ్రామానికి చెందిన రామచంద్రయ్య(50) అనే వ్యక్తి తిరుపతిలో చికిత్సపొందుతూ మృతిచెందారు.
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో చత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో బస్సుపై బాంబుదాడి చేయడంతో ఒక సీఐఎస్ఎఫ్ జవాన్తో పాటు మరో నలుగురు మరణించారు. మరో జవాన్తో పాటు ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దంతెవాడ జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలోని బచేలి సమీపంలో గురువారం బస్సుపై దాడి జరిగింది.
బుట్టాయగూడెం, నవంబర్ 8: మండలంలో రెడ్డికోపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థిని అనారోగ్యంతో మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలవరం మండలం చిలకలూరుకు చెందిన పాములేటి సీతమ్మ రెడ్డికోపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐదవ తరగతి చదువుకుంటుంది. దసరా సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన సీతమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది.
అల్లాదుర్గం, నవంబర్ 8: తాత ఆస్తికలను గోధావరి నదిలో కలిపి నాందేడ్ నుండి హైదరాబాద్ వస్తుండగా అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దపూర్ హైవే రహదారిపై నిలిపి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందారు.
తిరుపతి, నవంబర్ 8: స్కూటర్పై వచ్చి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళల మెడల్లోని బంగారు చైన్లు, వారి వద్ద ఉన్న పర్సులు, సెల్ఫోన్లను లాక్కెళ్లే కత్తి పవన్ (20) అనే నిందితుడిని తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుంచి దాదాపు రూ. 1.82లక్షల విలువ చేసే 60 గ్రాముల బంగారు నగలు, రూ. 2వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
గోరంట్ల, నవంబర్ 8 : మండల పరిధిలోని తమ్మినాయనపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందినట్లు సీఐ ధరణికిషోర్ తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు వెళ్తున్న లారీ డ్రైవర్ సునీల్ దూబే (42) లారీని రోడ్డు పక్కన నిలిపి నిలబడి ఉండగా ఓ కారు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు.