-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దిశపై అత్యాచారం చేసి క్రూరంగా హత్య చేసిన నలుగురు కిరాతకుల పోలీస్ ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు గురువారం న్యాయ విచారణకు ఆదేశించింది. న్యాయ విచారణ ఆరు నెలల్లో పూర్తి అయ్యేంత వరకు మరే ఇతర విచారణ జరిపేందుకు వీలు లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే, న్యాయమూర్తులు అబ్దుల్ నజీర్, సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు నవంబర్ 9న ఇచ్చిన అయోధ్య తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పద్దెనిమిది రివ్యూ పిటిషన్లు బుట్టదాఖలయ్యాయి. దీనితో రామమందర నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చాంబర్లో ఈ పద్దెనిమిది రివ్యూవ్ పటిషన్లను పరిశీలించింది.
రామాపురం, డిసెంబర్ 11: కడప జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. రామాపురం మండలం కొండవాండ్లపల్లె సమీపంలో కారును లారీ ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రాయచోటికి చెందిన హరూన్బాషా(30), ఆసిఫ్బాషా(28), అజీరాబేగం(45), డ్రైవర్ అర్షన్ఖాన్(31) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
విజయవాడ (క్రైం), డిసెంబర్ 11: గృహిణిపై వేధింపులు, ఆత్మహత్య కేసులో ఆమె భర్త, అత్తమామలకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు తీర్పుచెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా గూడూరు మండలం ఆకుమర్రు గ్రామానికి చెందిన బొల్లా లక్ష్మికి విద్యాధరపురానికి చెందిన పామర్తి శ్రీ్ధర్తో 2015 మార్చి 7న పెళ్లి జరిగింది. ఆ సమయంలో ఎకరం పొలం, రూ.
ఇచ్చోడ, డిసెంబర్ 11: విద్యుత్ తీగలను అమర్చి చిరుతపులిని హతమార్చిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బజార్హత్నూర్ మండలంలోని డెడ్రా అటవీ ప్రాంతంలోని గోసాయి, ఉమర్డబి గ్రామ శివారంలో మంగళవారం రాత్రి పంట పొలంలో కొందరు మాటువేసి విద్యుత్తీగలు అమర్చి చిరుతపులిని హతమార్చిన ఘటన కలకలం రేపింది.
జనగామ టౌన్, డిసెంబర్ 11: ఓ కాంట్రాక్టు ఉద్యోగికి సంబంధించిన వేతనం విడుదల చేయడంలో లంచం తీసుకుంటుండగా డీఎంఅండ్హెచ్వో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మధుసూధన్ తెలిపిన వివరాల ప్రకారం... జనగామ జిల్లా కేంద్రంలోని డీఎం అండ్ హెచ్వో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పృథ్వీరాజ్ రూ.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దిశ హంతకుల ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి చేత దర్యాప్తు జరిపిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రకటించింది. తెలంగాణ పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో నలుగురు దిశ హంతకులు హతమైన విషయం తెలిసిందే.
రాంచీ, డిసెంబర్ 10: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్లో ఒక సీఆర్పీఎఫ్ జవాను మద్యం సేవించి తన క్యాంపులోని ఒక అధికారి సహా ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిని కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో మరొకతడు గాయపడ్డాడు. అధికారులు మంగళవారం ఈ విషయం వెల్లడించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఇలా సహచరులను హతమార్చిన ఘటన జరగడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోది.
విజయవాడ (క్రైం), డిసెంబర్ 10: దుర్గగుడి దేవస్థానం నకిలీ వెబ్సైట్ కలకలం రేపుతోంది. దేవస్థానం ఆర్జిత సేవలు, దర్శనం, గదుల కేటాయిస్తామంటూ నకిలీ వెబ్సైట్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రచారంలోకి రావడంతో భక్తులు కలవరపాటుకు గురవుతున్నారు. సాక్షాత్తు అమ్మవారి పేరుమీద జరుగుతున్న ఈ వ్యవహారంపై దుర్గగుడి అధికారులు స్పందించారు. విషయం వెలుగులోకి రావడంతో వెబ్సైట్పై నిఘా ఉంచారు.
విజయవాడ పశ్చిమ, డిసెంబర్ 10: దంపతుల మధ్య విభేదాలతో పాతబస్తీలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఇరకాటంలో పడింది. స్కూల్లో చదువుతున్న ఏడేళ్ల బాలుడిని సొంత తల్లే బంధువుల సహకారంతో కిడ్నాప్ చేయడం కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో సంచలనం రేపింది. వించిపేట ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి మార్కాపురానికి చెందిన ఓ యువతికి సుమారు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం కలిగారు.