S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/17/2019 - 02:12

ఖైరతాబాద్, డిసెంబర్ 16: తమను విధుల్లో నుంచి తొలగించి, నిరుద్యోగంలోకి నెట్టవద్దని రవాణ శాఖ, జలసౌధ కార్యాలయాల వద్ద గూమిగూడిన ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

12/17/2019 - 02:04

జీడిమెట్ల, డిసెంబర్ 16: నిలబడి ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు మరో వ్యక్తిని ఓ ట్రాలీ వాహనం ఢీకొంది. ఆరుగురికి గాయాలైన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పాతబస్తీకి చెందిన రవీందర్ బాచుపల్లిలోని మమతా ఆసుపత్రిలో వార్డ్‌బాయ్‌గా పనిచేస్తాడు.

12/17/2019 - 02:02

జీడిమెట్ల, డిసెంబర్ 16: అక్రమంగా జెలిటెన్ స్టిక్స్, డిటోనేటర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను దుందిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దుందిగల్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను బాలానగర్ జోన్ డీసీపీ పద్మజా, దుందిగల్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. యాదాద్రి జిల్లా యాట సతీశ్(33) డ్రైవర్‌గా పనిచేస్తాడు.

12/17/2019 - 01:37

హైదరాబాద్: వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు అంశంపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయగా, వాటిపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు. తొలుత యథాతథ స్థితిని విధించిన హైకోర్టు ఆ ఉత్తర్వులను మరో 8 వారాల పాటు పొడిగించింది.

12/17/2019 - 01:05

కర్నూలు/, కొత్తవలస, డిసెంబర్ 16: రాష్ట్రంలో ముగ్గురు లంచగొండు అధికారులను ఏసీబీ వలపన్ని పట్టుకుంది. కర్మూలు జిల్లాలో సీఐ, విజయనగరం జిల్లాలో ఐసీడీఎస్ పీవో, సీనియర్ అసిస్టెంట్ అడ్డంగా దొరికిపోయారు. ఓ న్యాయ వాదిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరా లు ఇలా ఉన్నాయ..

12/17/2019 - 04:35

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార కేసులో బీజేపీ నుంచి ఇదివరకే బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్ దోషి అని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. శిక్షను బుధవారం ఖరారు చేయనున్నది. సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన శశి సింగ్‌ను నిర్ధోషిగా తేల్చింది.

12/16/2019 - 23:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు హింస, విధ్వంసకాండకు దారి తీయడం పట్ల సుప్రీం కోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసాకాండ తక్షణమే ఆగాలని ఆదేశించింది. ఇది శాంతి-భద్రతల సమస్య కాబట్టి ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, పోలీసులే పరిస్థితిని అదుపు చేయాలని స్పష్టం చేసింది.

12/16/2019 - 03:23

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 15: ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి తనయుడు అర్థరాత్రి దాటిన తర్వాత బీచ్‌రోడ్డులో అతివేగంగా కారును నడిపి మోటారుబైక్‌ను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో మెడికల్ విద్యార్థికి తీవ్రగాయాలు కాగా, మరొకరు స్పల్పగాయాలతో బయట పడ్డారు.

12/16/2019 - 02:54

న్యూఢిల్లీ: ఉన్నావో ప్రాంతంలో ఓ మహిళ అపహరణ, అత్యాచారం ఘటనపై డిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌పై ఆరోపణలు రావడంతో ఆ పార్టీ అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పుతో కులదీప్ సింగ్ సెంగార్ భవితవ్యం తేలిపోనుంది.

12/15/2019 - 03:48

నాగలాపురం, డిసెంబర్ 14: చిత్తూరు జిల్లా పిచ్చాటూరు సమీపంలో కూలి పనులకు వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తాప డిన ఘటనలో 19మంది గాయపడ్డారు వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.

Pages