S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/04/2018 - 04:52

మిడుతూరు, జూలై 3:మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామానికి చెందిన నాగశేషులు కుమారుడు నరేష్(22) మంగళవారం ట్రాక్టర్ ట్రాలీ కింద పడి మృతిచెందాడు. మట్టి లోడ్ వేసుకుని సొంతంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్న నరేష్ గ్రామ సమీపంలో రహదారి సరిగా లేకపోవడంతో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడుతుందేమోనని భావించి డ్రైవింగ్ సీటులో నుంచి పక్కకు దూకాడు.

07/04/2018 - 04:44

సామర్లకోట, జూలై 3: సామర్లకోట-పిఠాపురం రోడ్డులో జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆటోను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న అయిదుగురు గాయపడ్డారు. స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం..జల్లూరు వైపు నుంచి ఆటో వస్తుండగా, వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది.

07/04/2018 - 04:34

గనే్నరువరం, జూలై 3: మండలంలోని జంగపల్లి గ్రామంలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమండ్ల కొమురయ్య (51) గత రెండు సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నాడు.

07/04/2018 - 04:18

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 3: పొరుగు రాష్టమ్రైన కర్ణాటక నుండి గుట్కా ప్యాకెట్లు రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో వన్‌టౌన్ సిఐ రామకృష్ణ సోదాలు చేయగా ఏపి267119 టవెరా వాహనాన్ని సోదా చేయగా రూ.1.35లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పెద్ద మొత్తంలో లభ్యమైనట్లు ఆయన వెల్లడించారు. వీటిని రవాణా చేస్తున్న మహబూబ్‌నగర్ పట్టణంలోని హబీబ్‌నగర్ కాలనీవాసి ఖాజాపాషను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

07/04/2018 - 04:17

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 3: ఈ నెల 1వ తేదీన హన్వాడ మండలంలోని కొత్తచెరువుతాండలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో హన్వాడ ఎస్సై రాంబాబు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మహబూబ్‌నగర్ రూరల్ కానిస్టేబుల్‌తో పాటు 14మంది పేకాట రాయుళ్లను ఆరెస్టు చేసినట్లు డీటీసీ డీఎస్పీ సాయిమనోహర్ వెల్లడించారు.

07/04/2018 - 04:09

నిజామాబాద్, జూలై 3: జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడ ప్రాంతంలో జరిగిన భారీ చోరీ కేసును వారం రోజుల వ్యవధిలోనే నగర పోలీసులు ఛేదించగలిగారు. చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేశారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అదనపు డీసీపీ శ్రీ్ధర్‌రెడ్డి పట్టుబడ్డ నిందితుల వివరాలను వెల్లడించారు.

07/04/2018 - 04:02

తుర్కపల్లి, జూలై 3: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని రుస్తాపురం గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన యాసారం కనకయ్య (38) స్వగ్రామం నుండి భువనగిరికి మోటారు బైకుపై వెళ్తుండగా రుస్తాపురం గ్రామశివారులో భువనగిరి నుండి మాదాపురం గ్రామానికి వస్తున్న ఆటోను ఢీకొట్టాడు.

07/04/2018 - 04:01

అర్వపల్లి, జూలై 3: గుప్త నిధుల కోసం తాంత్రిక పూజలు చేసి తవ్వకాలు జరిపిన సంఘటన మండల కేంద్రమైన అర్వపల్లిలో కలకలం రేకత్తించింది.

07/04/2018 - 01:34

జీడిమెట్ల, జూలై 3: అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్లు మృతిచెందిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బౌరంపేట్ గ్రామంలో జరిగిన ఈ ఘటన గ్రామస్థులను కలచివేసింది. సీఐ శంకరయ్య, గ్రామస్థులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో నివాసముండే అల్లంతగారి అనిత(28)కు శ్రీనుతో 2011 జూన్ 29న వివాహం జరిగింది. వీరికి కూతురు నవ్య (6) సంతానం.

07/04/2018 - 01:22

మడకశిర, జూలై 3 : మడకశిర కొండపై సోమందేపల్లి మండలం మండ్లికి చెందిన హనుమంతు (32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం మేకల కాపరులు మేకలను మేతకు తీసుకెళ్లి కాపరులు కొండపై ఉన్న పావురాలగుట్ట వద్ద వ్యక్తి మృతదేహం చూసి పోలీసులకు సమాచారం అందించారు.

Pages