S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/28/2018 - 02:30

హుస్నాబాద్, ఏప్రిల్ 27: హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన సుంకేటి వెంకటి (40) అప్పుల బాధ భరించలేక గురువారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటయ్య తనకున్న మూడెకరాల వ్యవసాయంలో పంట సరిగా రాక అప్పుల బాదై ఏమీ తోచని పరిస్థితిలో గురువారం రాత్రి బావి వద్దకు వరికి నీరు పెట్టడానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

04/28/2018 - 02:22

వరంగల్, ఏప్రిల్ 27: ఇతర ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఒంటరిగా ఆర్టీసీ బస్సులు ఎక్కే మహిళల బ్యాగుల్లోని బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న మహిళా నిందితురాలిని ఇంతేజార్‌గంజ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితురాలి నుండి సుమారు 5లక్షల 65వేల రూపయల విలువగల 200.5 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

04/28/2018 - 02:22

పరకాల, ఏప్రిల్ 27: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం రాయపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పరకాల ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. రాయపర్తి గ్రామానికి చెందిన చంద్రకర్ (32) ఎంఎస్సీ బీఈడీ చదివాడు. అయితే, చంద్రకర్ గత రెండు సంవత్సరాల నుంచి వారికి ఉన్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు.

04/28/2018 - 02:16

కౌటాల , ఏప్రిల్ 27: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (ట) మండలం లోడ్‌పల్లి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి పెళ్లి వ్యాన్ , ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న 15 మంది మహారాష్ట్ర వాసులు గాయాల పాలయ్యారు.

04/28/2018 - 02:13

తూప్రాన్, ఏప్రిల్ 27: జాతీయ రహదారి ప్రక్కన గల పశువుల దొడ్ల నుండి పశువులు దొంగతనానికి పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పి రాంగోపాల్‌రావు పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరించారు.

04/28/2018 - 02:11

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 27: ఉమ్మడి మెదక్ జిల్లా వీ6 స్ట్ఫా రిపోర్టర్ డి. ప్రసన్న శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సిద్ధిపేట జిల్లా కొడకండ్ల గ్రామ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ప్రసన్న మృతి చెందా డు. మే 6న తన తమ్ముడి వివాహం ఉండటంతో పెండ్లి పత్రికలు పంచేందుకు కారులో వెళ్తుండగా డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

04/28/2018 - 02:01

శాంతినగర్, ఏప్రిల్ 27: వడ్డేపల్లి మండల పరిధిలోని జక్కిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మహేందర్(22) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన నాగవేణి(19) అనే యువతిని ప్రేమించి పెళ్లిదాకా వచ్చి విఫలం కావడంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

04/28/2018 - 01:20

పిడుగురాళ్ల, ఏప్రిల్ 27: చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే కేసును పోలీసులు ఛేదించిన సంఘటన శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... మిర్యాలగూడకు చెందిన మహాలక్ష్మి పిడుగురాళ్లలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వివాహ అనంతరం పట్టణంలోని తన తండ్రి ఇంటికి వెళ్లారు.

04/28/2018 - 01:19

అచ్చంపేట, ఏప్రిల్ 27: కోళ్లను దొంగిలించాడన్న కేసు విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు శుక్రవారం కొండూరులోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వివరాలను కుటుంబ సభ్యులు ఇలా వివరించారు... గ్రామానికి చెందిన పులి తిరుపతిరాజు, పులి వీరరాజు, గురవారావుకు చెందిన పది కోళ్లు అదృశ్యమైనట్లు 15 రోజుల క్రితం అచ్చంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు.

04/28/2018 - 00:39

సంగం, ఏప్రిల్ 27:హత్యాయత్నం కేసులో సంగం మండలానికి చెందిన ఇద్దరు వీఅర్వోలను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై వేణు తెలిపిన వివరాల మేరకు ఉడ్‌హౌస్‌పేట గ్రామానికి చెందిన తిరుపతిరావు, సుష్మ ఇద్దరు దంపతులు. సుష్మ మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. తరుణవాయి గ్రామానికి చెందిన వీఆర్వో రామక్రిష్ణారెడ్డికి సుష్మతో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది.

Pages