S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైపర్ సినిమా తర్వాత హీరో రామ్ కొంచెం గ్యాప్ తీసుకుని 15వ సినిమా చేస్తున్నాడు. నేను శైలజ సినిమాతో రామ్కు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు కిశోర్ తిరుమల చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. ఈమధ్యే వైజాగ్, హైదరాబాద్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్రం, ఆగస్టు నుంచి ఊటీ షెడ్యూల్కు వెళ్లనుంది. ఈ చిత్రానికి ‘ఉన్నది ఒకటే జిందగీ’ టైటిల్ ఖరారు చేసినట్టు తాజా సమాచారం. త్వరలోనే ఫస్ట్లుక్ను రిలీజ్ చేయనున్నారట.
తెలుగు హీరో మంచు విష్ణు మలేషియాలో తీవ్రంగా గాయపడ్డా రు. ఆయన నటిస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మలేసియాలో జరుగుతోంది. సినిమాలో బైక్ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొని ప్రమా దం జరి గింది. ప్రమాదంలో భుజం, మెడ భాగాలకు బలమైన గాయాలు తగిలాయని అంటున్నారు.
‘దర్శకుడు’ సినిమాలో ప్యాషన్ డిజైనర్ నమ్రతగా కనిపించబోతోంది ఈష. జీవితంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనే తపనవున్న యువతిగా కనిపిస్తా అంటోంది. ఔత్సాహిక దర్శకులతో ఆమె పరిచయం ప్రేమకు ఎలా దారితీసిందీ, ఆ ప్రయాణంలో వారికి ఎదురైన అనుభవాలేమిటి? వృత్తిపరమైన లక్ష్యాలు, ప్రేమ మధ్య ఇద్దరి సంఘర్షణ ఎలా ఉంటుంది? అనే అంశాల సమాహారంగా చిత్రం సాగుతుందని నటి ఈష తెలిపారు.
పెరుగుతున్నఅంచనాలే జై2కొంపముంచుతాయా? ఇప్పుడు ఇండస్ట్రీని ముసురుతున్న అనుమానాలివి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవ కుశ. ఎన్టీఆర్కు జోడీగా రాశీఖన్నా, నివే దా థామస్ కనిపించనున్నారు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడన్న సమాచారం బయటపడిన దగ్గర్నుంచీ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగాయి.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా సాగుతోన్న బిగ్బాస్కి మంచి టిఆర్పి రేటింగ్సే దక్కుతున్నాయి. షోలో పార్టిసిపేంట్స్ మాటెలావున్నా, హోస్ట్ ఎన్టీఆర్కంటూ సెపరేట్ పాపులార్టీ ఉంది కనుక, తెలుగులో షో అనుకున్న దానికంటే బాగానే పాపులరవుతోంది. షో పాపులార్టీని దృష్టిలో పెట్టుకుని, మొదట్లో వద్దనుకున్న వాళ్లంతా ఇప్పుడు ఎంటరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుతం బాలీవుడ్లో మంచి పేరుతెచ్చుకున్న సొట్టబుగ్గల తాప్సీకి సౌత్లో సక్సెస్ అందుకోవాలనే కోరిక మాత్రం తగ్గలేదు. ఇప్పటికే సౌత్లో పలు ప్రయత్నాలు చేస్తున్న ఈమె, తెలుగు, తమిళ భాషల్లో రెండేసి చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం సౌత్లో హర్రర్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఆనందో బ్రహ్మ అంటూ తెరకెక్కుతున్న సినిమాలో తాప్సీ నటించింది. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసా వసూల్ సినిమాకు సంబంధించిన స్టంపర్ లేటెస్టుగా విడుదలై సంచలనం రేపుతోంది. ఇదివరకు మనం టీజర్, ట్రైలర్, మోషన్ పోస్టర్లను చూశాం. మొదటిసారిగా స్టంపర్ అంటూ కొత్త టెక్నాలజీతో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ కొత్త లుక్తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985 హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుపుతున్నారు. ఈ సినిమా తరువాత తదుపరి చిత్రం కోసం రామ్చరణ్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరుపుతున్న చరణ్తో సినిమా చేయడానికి మరో దర్శకుడు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు.
రచయితగా పలు చిత్రాలకు పనిచేసిన శ్రీ్ధర్ శీపానను దర్శకుడిగా పరిచయం చేస్తూ జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ వంగల నిర్మిస్తున్న చిత్రం ‘బృందావనమది అందరిది’. ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీ్ధర్ శీపాన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వై.వి.
నితిన్, మేఘా ఆకాష్ జంటగా రూపొందిన లై (లవ్ ఇంటిలిజెన్స్ ఎనిమిటి) -ఆగస్టు 11న థియేటర్లకు రాబోతోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర సంయుక్తంగా రూపొందించిన చిత్రాన్ని 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడారు. ఇటీవల విడుదలైన భమ్భాట్, మిస్ సన్షైన్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.