S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భగవాన్ రమణ మహర్షి రాసిన కథను ఇన్స్పిరేషన్గా తీసుకొని, కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా గౌతమ్నంద చిత్రాన్ని తెరకెక్కించానని అంటున్నాడు సంపత్ నంది. ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ వంటి చిత్రాలతో కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, తాజాగా గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రం గౌతమ్నంద.
చేతన్ మద్దినేని, డిపుల్ చోప్డే, సంతోష్ పవన్ ప్రధాన తారాగణంగా శ్రావ్యా ఫిలింస్ పతాకంపై చేతన్ మద్దినేని హీరోగా పి.సునీల్కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు, ఎం.ఎస్.రామ్కుమార్ రూపొందించిన చిత్రం ‘గల్ఫ్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం కాగా, పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు.
మహీధర్, సోనాక్షిసింగ్ జంటగా జి.శివగంగాధర్ దర్శకత్వంలో అశ్విని క్రియేషన్స్ పతాకంపై కె.శేషగిరిరావు నిర్మిస్తున్న చిత్రం ‘నా లవ్స్టోరీ’. షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు వివరాలు తెలియజేస్తూ- ‘నేను శివశక్తిదత్తా, ఈశ్వర్రెడ్డి వంటి దర్శకుల దగ్గర పనిచేశాను. ఈ చిత్రం రెండో షెడ్యూ ల్ పూర్తిచేసుకుంది. ఆగస్టులో పాటల చిత్రీకరణ జరపనున్నాం.
అందంతోపాటు అభినయం కూడా కేథరిన్కు ఉంది. ఎందు కో కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అడపాదడపా మాత్రం సెకండ్ హీరోయిన్గా అవకాశాలను దక్కించుకుంటోంది. త్వరలో ఈమె నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా గౌతమ్నంద చిత్రం గురించి ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ పాటలో కేథరిన్ బికినీలో కనిపించనున్నట్టు టాక్.
యాపిల్ బ్యూటీ హన్సిక ప్రస్తుతం క్రొయేషియా సముద్ర తీరాన సేదతీరుతోంది. బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ అమ్మడు ప్రస్తుతం కోలీవుడ్లో టాప్ స్టార్గా వెలిగింది. ఓ రకంగా ‘చిన్న కుష్బూ’గా మన్ననలందుకుంటూ గుడి కూడా కట్టించుకునే స్థాయికి ఎదిగింది. వరుస సినిమా షూటింగ్లతో విసిగిపోయిన ఈ అమ్మడు ప్రస్తుతం తన స్నేహితులతో ప్రపంచ యాత్రలో భాగంగా క్రొయేషియా సముద్ర తీరంలో సేద తీరుతోందట.
భిన్నమైన సినిమాలు చేస్తూ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోలేదు ప్రముఖ నటుడు వెంకటేష్. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆకట్టుకునేలా సినిమాలు చేసిన ఆయన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మల్టీస్టారర్ సినిమాలకు తెరలేపారు. ఆ తరువాత పవన్తో గోపాల గోపాల, రామ్తో మసాల వంటి చిత్రాలు చేసిన వెంకటేష్, తాజాగా రానాతో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా భానుమతి అందరినీ ఫిదా చేసింది. ముఖ్యంగా కుర్రకారుకి భానుమతి ఫీవర్ పట్టుకుంది. ఆ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది అందాల భామ సాయిపల్లవి. మలయాళంలో రూపొందిన ప్రేమమ్ సినిమాలో నటించిన సాయి పల్లవి ఫిదా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. వరుణ్తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్హిట్ టాక్ను తెచ్చుకుని విజయవంతంగా నడుస్తోంది.
దువ్వాడ జగన్నాథమ్ తరువాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం 3నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా2. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మిలటరీ అధికారిగా కన్పించనున్నాడట. దానికోసం ఆయన నిజంగానే మిలటరీ ట్రైనింగ్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలోని పాత్రకు వంద శాతం న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.
నాగార్జున నటిస్తున్న తాజా సినిమాకు ఇప్పుడు విడుదల తేదీ ఖరారైంది. నాగార్జున ఓ దెయ్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన రాజుగారి గది చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న రాజుగారి గది-2లో నటిస్తున్నారు ఆయన. సీరత్ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సమంత ఓ కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.
విజయ్ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా ఆదిరామ్ దర్శకత్వంలో కన్నడంలో విజయవంతమైన చిత్రం రణతం త్ర. ఈ చిత్రాన్ని శ్రీ జెవి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత వెంకట్రావ్ మా ర్టోరి ఇది పెద్ద సైతాన్2 పేరుతో అనువదించా రు. ఈ చిత్రా న్ని అన్ని కార్యక్రమలు పూర్తి చేసి ఆగస్టు 4నవిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.