-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, జూలై 18: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం పార్లమెంటులో చర్చకు రానుంది. ఈ తీర్మానంపై బుధవారం మధ్యాహ్నం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ, జూలై 18: అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు మరణ శిక్ష లాంటి కఠినమైన శిక్షలు ఖరారుచేసే విధంగా నేర శిక్ష్మా స్మృతి సవరణల బిల్లుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. పనె్నండేళ్ల లోపు వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులు రుజువైన పక్షంలో దోషులకు మరణ శిక్షను విధించే విధంగా బిల్లుకు కేంద్రమంత్రి మండలి ఆమోదించింది.
న్యూఢిల్లీ: ఆలయం ప్రజల ఆస్తి. పూజించే చోట ఈ భేదభావం సరికాదని సుప్రీం కోర్టు తెలిపింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. పూజాకార్యక్రమాల్లో అందరికీ సమాన హక్కులు ఉంటాయని బెంచ్కు నేతృత్వం వహిస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. మహిళలను అడ్డుకోవడం అంటే.. వాళ్ల రాజ్యాంగ హక్కును కాలరాసినట్టేనని ధర్మాసనం తెలిపింది.
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై వచ్చే శుక్రవారం చర్చించనున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించిన నేపథ్యంలో అధికార బీజేపీ తన పార్టీ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఆ రోజు లోక్సభలో డుమ్మా కొట్టిన ఎంపీలపై అనర్హత వేటు కూడా వేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అహ్మదాబాద్ : గుజరాత్లో కుచ్ నుంచి రాజ్కోట్లో మంగళవారం రాత్రి జరిగిను ఘోర రోడ్డుప్రమాదం ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కారు ఎదురుగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో.. అక్కడికక్కడే ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు విపక్షాలకు తగిన సంఖ్యా బలం ఉందా అనే ప్రశ్నకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ బుధవారంనాడు సూటిగా స్పందించారు. 'మాకు సంఖ్యాబలం లేదని ఎవరు చెప్పారు'? అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు.
సిమ్లా : భారత వాయుసేనకు చెందిన ఎంఐజీ-21 యుద్ధ విమానం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని జవాలి సబ్ డివిజన్ పట్టా జతియన్ ప్రాంతంలో బుధవారం కుప్పకూలింది. ప్రమాదం నేపథ్యంలో పైలట్ గల్లంతయ్యారని ప్రాథమిక వివరాలు వెల్లడించాయి. సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
హైదరాబాద్:ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి జళకళతో నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు గేట్లు నీటిని దిగువకు విడుదల చేశారు. మరోరెండు మూడు రోజుల్లో తెలంగాణలో బిరబిరమంటూ కృష్ణమ్మ పరుగులు మొదలయ్యే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు బాక్సర్ మేరీకోమ్ హాజరయ్యారు. ఆమెను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ రాజ్యసభ సభ్యురాలిగా నియమించిన విషయం విదితమే.
న్యూఢిల్లీ: మోదీపై విపక్షపార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చిద్దామని లోకసభలో స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానానికి 50 మంది సభ్యుల మద్దతు లభించటంతో స్పీకర్ అనుమతికి అంగీకరించారు. దీనిపై ఈ శుక్రవారం చర్చ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆ రోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అవిశ్వాసంపై చర్చ చేపడతామని తెలిపారు. బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.