S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/19/2018 - 01:25

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దగాకోరు లావాదేవీలు భిన్న కోణాల్లో వెలుగుచూస్తే గగ్గోలు పెట్టిస్తున్నాయి. వజ్రం అంటే అమూల్యం.. అమోఘం. దాని విలువ విస్మయకరమే. ఇలాంటి వజ్రానే్న ఆసరా చేసుకుని నీరవ్ మోదీ వేలకోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడ్డాడు. తాజాగా సెబి మొత్తం వజ్రాల వ్యాపారాలపై దృష్టి పెట్టింది.

02/19/2018 - 01:18

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: బిజేపీ నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వ పెద్దలతో వివిధ కుంభకోణాల సూత్రధారులకు బలమైన సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ, బ్యాకింగ్ సెక్టార్‌లో గత ఐదేళ్లలో జరిగిన 61వేల కోట్ల రూపాయల కుంభకోణాలపై శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

02/19/2018 - 01:17

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: కొత్త ఆలోచనలు, వినూత్న ప్రక్రియలు డబ్బు కంటే ఎంతో విలువైనవని 21వ శతాబ్దం విజ్ఞాన ఆర్థిక వ్యవస్థకు నిరుపమాన నిదర్శనమని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. మానవ సమాజ సుస్థిర అభివృద్ధి అన్నది భారతీయ విలువలు జోడించిన ఆధునిక శాస్త్ర సంకేతిక విజ్ఞానం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

02/19/2018 - 01:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఒకపక్క భాషలను వాటితో ముడిపడివున్న మాండలికాలను పరిరక్షించుకునే ప్రయత్నాలను ప్రభుత్వాలు చేపడుతున్న నేపథ్యంలో దేశంలో 40కి పైగా భాషలు, మాండలికాలు కరుమరుగైపోతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

02/19/2018 - 01:10

ముంబయి, ఫిబ్రవరి 18:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేపట్టిన బడ్జెట్ సంస్కరణల వల్ల కొత్త పని సంస్కృతి ఆవిష్కృతమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనివల్ల దేశంలో సామాజిక-ఆర్థిక పరివర్తన సాధ్యమైందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించిన మోదీ ‘మాకు ఫలితాలే ముఖ్యం. వాటిని సాధించేందుకు నిధుల లేమి ఏ మాత్రం అవరోధం కాదు.

02/19/2018 - 01:06

కంచీపురం, ఫిబ్రవరి 18: తమిళనాడులోని కాంచీపురంలో ఆదివారం ఓ బస్సు మినీ టెంపోను ఢీకొన్న దుర్ఘటనలో 9 మంది మహిళలు సహా 9మంది మరణించారు. జిల్లాలోని థమ్మల్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. 25మంది ప్రయాణికులు వెళుతున్న టెంపోపైకి బస్సు దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారని, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కన్నుమూశాడని తెలిపారు.

02/19/2018 - 01:05

చెన్నై, ఫిబ్రవరి 18:కావేరీ జలాల పంపిణీలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చాటేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తమిళనాడులోని ప్రతిపక్ష డీఎంకే నిర్ణయించింది. వచ్చే వారం కొత్త పార్టీని పెట్టబోతున్న ప్రసిద్ధ నటుడు కమల్ హసన్ ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకరించారని డిఎంకె వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్‌కె స్టాలిన్ ఆదివారం ఇక్కడ వెల్లడించారు.

02/19/2018 - 00:37

భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూ ఆదివారం కుటుంబ సమేతంగా ఆగ్రాలోని తాజ్‌మహాల్‌ను సందర్శించారు. తాజ్ అందాలను చూసి మైమరచిపోయారు. పిల్లలతో అక్కడ సరదాగా గడిపి, ఫొటోలు దిగారు.
సోమవారం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు.

02/19/2018 - 00:34

ప్రతి పనె్నండు సంవత్సరాలకు ఒకసారి జరిగే గోమఠేశ్వర బాహుబలి మహామస్తకాభిషేకం ఆదివారం కర్నాటకలోని శ్రావణబిళగొళలో ప్రారంభమైంది. బాహుబలి విగ్రహానికి ఈ మహామస్తకాభిషేకం జరిగింది.
2006లో ఈ అభిషేకం నిర్వహించారు. ఏకశిలపై చెక్కిన 57 అడుగుల బాహుబలి విగ్రహానికి ఇది
88వ మహా మస్తకాభిషేకం. ఒక్క శిలపై ఇంత భారీ విగ్రహం చెక్కడం ప్రపంచంలోనే మొట్టమొదటిది.

02/19/2018 - 00:33

చెన్నై, ఫిబ్రవరి 18: మరో మూడు రోజుల్లో ప్రసిద్ధ నటుడు కమల్‌హాసన్ కొత్త పార్టీ ఆవిష్కృతం కాబోతోంది. ఇందుకు సంబంధించి ఊహాగానాలు జోరందుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆదివారం సూపర్‌స్టార్ రజనీకాంత్ నివాసానికి వెళ్లి మంతనాలు జరిపారు. తమిళ సినీరంగంలో కోట్లాదిమంది అభిమానుల బాసట కలిగిన వీరిద్దరూ సమావేశం కావడంతో రాజకీయంగా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న సంకేతాలూ వ్యక్తమయ్యాయి.

Pages