-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
చింతూరు, జూన్ 24: ఛత్తీస్గడ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో అయిదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. చింతకుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని తొండామార్కా అటవీ ప్రాంతంలో స్పెషల్ టాస్క్ఫోర్సు, ఎస్టిఎఫ్, డిస్ట్రిక్టు రిజర్వు గ్రూపు (డిఆర్జి), కోబ్రా దళాలు కూంబింగ్ చేబడుతున్నాయి.
శ్రీనగర్, జూన్ 24: కాశ్మీరులో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. శ్రీనగర్లో శనివారం సాయంత్రం సిఆర్పిఎఫ్ వాహనంపై కాల్పులకు తెగడి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు మరో ఇద్దరు జవాన్లను గాయపర్చారు. దీంతో తాము ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు సిఆర్పిఎఫ్ ఐజి రవిదీప్ సాహి తెలిపారు.
శ్రీనగర్, జూన్ 24: శ్రీనగర్లోని జామా మసీదు వద్ద డిఎస్పీ మహమ్మద్ అయూబ్ పండిత్ను రాళ్లతో కొట్టి చంపిన సంఘటనపై దర్యాప్తు జరపడానికి జమ్మూ, కాశ్మీర్ పోలీసు శనివారం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ బృందం ఈ నేరంతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించిన 12 మందిలో అయిదుగురిని అరెస్టు కూడా చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 24: లాభదాయక పదవుల కేసులో ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తమపై దాఖలైన లాభదాయక పదవుల కేసును ఉపసంహరించుకోవాలంటూ 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ను ఇసి తిరస్కరించింది. ఆమ్ ఆద్మీ పార్టీలో కనీసం రెండు డజన్ల మంది ఎమ్మెల్యేలు లాభదాయక పదవులు అనుభవిస్తున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 24: మధ్యప్రదేశ్ సీనియర్ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఎన్నికల్లో అయిన ఖర్చుకు సంబంధించిన లెక్కలు చెప్పకపోవడంతో మిశ్రాపై మూడేళ్లపాటు అనర్హత వేటు పడింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మిశ్రా ఎన్నికల ఖర్చులు అఫిడవిట్ రూపంలో వెల్లడించాల్సి ఉంది. ప్రతి అభ్యర్థి కచ్చితంగా ఇది పాటించాల్సిందే.
న్యూఢిల్లీ, జూన్ 24: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 17న ప్రారంభమై ఆగస్టు 11 వరకూ కొనసాగుతాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. తొలి రోజున రాష్టప్రతి ఎన్నికకు ఓటింగ్ జరుగుతుంది. రామ్నాథ్ కోవింద్ ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, జూన్ 24: భారత్కు సభ్యత్వం కల్పించే విషయమై నిర్ణయం తీసుకోవడంలో అణు సరఫరాల గ్రూపు (ఎన్ఎస్జి) మరోసారి విఫలమైంది. అయితే అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పిటి)పై సంతకం చేయని దేశాలకు అణు సరఫరాల గ్రూపులో సభ్యత్వం కల్పించాలా? లేదా? అనే విషయంపై నవంబర్లో మరోసారి చర్చించాలని ఎన్ఎస్జి నిర్ణయించింది.
న్యూఢిల్లీ, జూన్ 24: ప్రతిపక్షం ఓట్లు చీల్చటంద్వారా ఎన్డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు బిజెపి ఎత్తు వేస్తోంది. ప్రతిపక్షంలోని సమాజ్వాదీ, బిఎస్పి, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన ఎంపీల మద్దతు సంపాదించేందుకు బిజెపి తెరవెనక రాజకీయం చేస్తున్నట్లు తెలిసింది.
లక్నో, జూన్ 24: రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ ప్రజాప్రతినిధుల మద్దతు కోరేందుకు ఆదివారం ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. రాష్టప్రతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థి అయిన మీరాకుమార్ కూడా త్వరలోనే లక్నో సందర్శిస్తారని, ఈ ఎన్నికకోసం ఏ అవకాశాన్నీ వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.
డార్జిలింగ్, జూన్ 24: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం) అధినేత బిమల్ గురుంగ్ పిలుపు మేరకు డార్జిలింగ్లోని అనేక ప్రాంతాల్లో నిరవధిక సమ్మె కొనసాగుతోంది. పదోరోజు శనివారం ఉద్రిక్తత వాతావరణ కొనసాగింది. ఏడు రోజులుగా ఇంటర్నెట్ సర్వీసులు, స్థానిక టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి.