S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/28/2016 - 01:47

లక్నో, డిసెంబర్ 27: తమ పార్టీ తీసుకుంటున్న విరాళాలు కానీ, తమ పార్టీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.104 కోట్లు కానీ పూర్తిగా చట్టబద్ధమైనవని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. బిఎస్‌పికి చెందిన ఓ ఖాతాలో రూ.104 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించిన ఒక రోజు తరువాత మాయావతి స్పందించారు. పార్టీ ఖాతాతో పాటు తన సోదరుడు ఆనంద్‌కు చెందిన మరో ఖాతాలో రూ.1.43 లక్షలు ఉన్నట్లు గుర్తించారు.

12/28/2016 - 01:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: పెద్దనోట్ల రద్దుకు ఆకస్మాత్తుగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొటున్నారని కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతురావు అన్నారు. మంగళవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ఒక్క శాతం ఉన్న నల్ల కుబేరులను పట్టుకోకుండా ప్రజలకు ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు. నోట్లరద్దుతో నగదు లభించక రైతులు, కార్మిక వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

12/28/2016 - 01:43

డెహ్రాడూన్, డిసెంబర్ 27: ఉత్తరాఖండ్‌ను అభివృద్ధిలో అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లడం ద్వారా ఉపాధి అవకాశాలు లేక ఇక్కడి యువత వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చేయాలన్నదే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మంగళవారం ఆయన 12,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న చార్‌ధామ్ హైవే అభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఇక్కడి పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన పరివర్తన్ మహార్యాలీలో ప్రసంగించారు.

12/28/2016 - 01:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: సహారా- బిర్లాల నుంచి ముడుపులు తీసుకున్నారన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపణలపై విచారణను ఎదుర్కోవటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు పారిపోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, యూపిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలాదీక్షిత్ మంగళవారం ప్రశ్నించారు.

12/28/2016 - 01:33

పనాజి, డిసెంబర్ 27: పనాజి విమానాశ్రయంలో మంగళవారం తెల్లవారుజామున 161 మందితో ముంబయి వెళుతున్న జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. 154 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో ముంబయి వెళ్తున్న ఈ విమానం తెల్లవారుజామున 5 గంటల సమయంలో టేకాఫ్ అవుతుండగా ముందు చక్రం అదుపు తప్పి 360 డిగ్రీల కోణంలో గింగిరాలు తిరుగుతూ రన్‌వేనుంచి జారి మట్టిలోకి దిగబడింది.

12/28/2016 - 01:06

డెహ్రాడూన్, డిసెంబర్ 27: ‘నేను ఒక చౌకీదార్ (కాపలాదారు)గా పనిచేస్తున్నా. నల్లధనం, అవినీతి నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు నా విధి నేను నిర్వర్తిస్తున్నా. నా పని నేను చేసుకుపోతుంటే, గిట్టని వాళ్లు అడ్డుపడుతున్నారు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై తాను తీసుకున్న నిర్ణయంతో దేశంలో ఉగ్రవాదులకు నిధుల సరఫరా పూర్తిగా ఆగిపోయిందన్నారు.

12/28/2016 - 01:03

చెన్నై, డిసెంబర్ 27: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇంకా తానే కొనసాగుతున్నానని, తనకు ఇంత వరకూ బదిలీ ఉత్తర్వులు జారీ కాలేదని బర్త్ఫ్‌క్రు గురైన పి.రామమోహన రావు స్పష్టం చేశారు. తన ఇంటిపై జరిగిన ఆదాయం పన్ను దాడులను ఓ ఉన్నతాధికారి కార్యాలయంపై జరిగిన దాడిని రాజ్యాంగ ఉల్లంఘనగా ఆయన అభివర్ణించారు.

12/27/2016 - 04:17

న్యూఢిల్లీ,డిసెంబర్ 26: విభజన వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామన్న హామీని పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ రుణం విడుదల చేయటం ద్వారా కొంతవరకు నిలబెట్టుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. జాతీయప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి కేంద్రం నుండి ఆర్థిక సహాయ అందుతుందా?

12/27/2016 - 04:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లు చరిత్రలో నిలిచిపోతాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పోలవరం నిర్మాణానికి నాబార్డు రుణాన్ని చెక్కు రూపంలో కేంద్రమంత్రి ఆరుణ్‌జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.

12/27/2016 - 03:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: పెద్దనోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జనవరి ఐదో తేదీన దేశంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తుంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన సోమవారం జరిగిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, పిసిసి అధ్యక్షులు, సీనియర్ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Pages