S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/09/2016 - 07:57

న్యూఢిల్లీ, జూలై 8: తాజా మంత్రివర్గ విస్తరణతో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కోటీశ్వరుల సంఖ్య 72కు చేరుకుందని, అలాగే క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించిన మంత్రుల సంఖ్య 24కు పెరిగిందని ఢిల్లీకి చెందిన ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పేర్కొంది.

07/09/2016 - 07:56

న్యూఢిల్లీ, జూలై 8: మణిపూర్‌లో సైనిక, పారామిలటరీ దళాలు మితిమీరిన బలప్రయోగానికి, ప్రతీకార దాడులకు దిగకూడదని, ఇటువంటి ఉదంతాలేమైనా జరిగి ఉంటే ఆ ఘటనలపై దర్యాప్తు జరపాల్సిందేనని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. మణిపూర్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని జస్టిస్ ఎం.బి.లోకుర్, జస్టిస్ యు.యు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం అమికస్ క్యూరీని ఆదేశించింది.

07/09/2016 - 05:55

న్యూఢిల్లీ, జూలై 8: వైకాపా పార్టీ ఫిరాయింపులపై దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలపై శాసన సభ స్పీకర్ పట్టించుకోవడం లేదని, ఫిర్యాదులను తక్షణం పరిష్కరించేలా ఆదేశించాలంటూ వైకాపా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

07/09/2016 - 05:12

న్యూఢిల్లీ,జూలై 8:పార్టీ ఫిరాయింపులతో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడుతున్న రాజకీయ శూన్యాన్ని అంది పుచ్చుకోవాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుంచి సమర్థులైనా నాయకులు పార్టీలోకి వస్తే..వారిని ఆహ్వానించాలని రాష్ట్ర న్యాయకత్వానికి ఆయన సూచించారు. బిజెపి కేంద్ర కార్యలయంలో శుక్రవారం ఉదయం ఏపీకి సంబంధించిన పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.

07/09/2016 - 05:11

న్యూఢిల్లీ,జూలై 8: ఆంధ్ర ప్రదేశ్ బిజెపికి కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ అధినాయకత్వం మల్లాగుల్లాలు పడుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు కంభంపాటి హరిబాబునే కొనసాగించాలని పార్టీలోని ఓ బలమైన పక్షం గట్టిగా వాదిస్తుంటే మరో వర్గం మాత్రం విధాన మండలి సభ్యుడు సోము వీర్రాజును నియమించాలని పట్టుపడుతోంది.

07/09/2016 - 05:05

న్యూఢిల్లీ, జూలై 8: కృష్ణా నదీ జలాల వివాదం నాలుగు రాష్ట్రాలకు సంబంధించినది. ఎగువ రాష్ట్రాలను వదిలేసి తెలంగాణ, ఏపీల మధ్య నీటి పంపకాలు సాగితే, భవిష్యత్‌లో తెలంగాణకు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వాదనలు వినిపించింది. కృష్ణా నదీ జలాల వివాదాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం తన వాదన వినిపించింది.

07/08/2016 - 18:20

దిల్లీ: 2008 మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలు ప్రజ్ఞా ఠాకూర్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కలవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ శుక్రవారం విమర్శలు చేశారు. ఇస్లాం బోధకుడు జకీర్‌ నాయక్‌తో 2012లో దిగ్విజయ్‌ వేదిక పంచుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై భాజపా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దిగ్విజయ్‌ ఎదురుదాడికి దిగారు.

07/08/2016 - 18:14

గుజరాత్‌: పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి అధ్యక్షుడు హార్దిక్‌ పటేల్‌కు శుక్రవారం గుజరాత్‌ న్యాయస్థానం శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఓబీసీ కేటగిరీలో పాటీదార్లను చేర్చుకోవాలంటూ పటేల్‌ వర్గీయులు హార్దిక్‌ పటేల్‌ నేతృత్వంలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఆరు నెలల పాటు గుజరాత్‌ రావద్దని బయటే ఎక్కడైనా ఉండాలని ఆదేశించింది.

07/08/2016 - 18:10

ఫిలిబిత్ (యుపి): బిజెపి ఎంపి వరుణ్‌గాంధీకి ఇక్కడి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు ఈ చర్య తీసుకుంది. 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా వరుణ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని రెండు కేసులు దాఖలయ్యాయి. 2013లో స్థానిక కోర్టు ఆ కేసుల్లో వరుణ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, అసద్ హయత్ అనే సామాజిక కార్యకర్త జిల్లా కోర్టులో అప్పీలు చేశాడు.

07/08/2016 - 16:49

దిల్లీ: టెలికాంశాఖలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ శుక్రవారం స్పష్టం చేశారు. మోదీ సర్కారు రూ.45వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపణలు చేసిన నేపథ్యంలో రవిశంకరప్రసాద్‌ విలేకరులతో మాట్లాడుతూ, రెండేళ్లలో టెలికాంశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు.

Pages