దళిత జాతి ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే
Published Friday, 10 June 2016చార్మినార్, జూన్ 9: దళిత జాతి ఉన్నంతవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరినిర్వాన్ భూమి సమ్మాన్ కార్యసమితి పేర్కొంది. గురువారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల అభినందన సభకు ముఖ్య అతిథిగా అంబేద్కర్ పరినిర్వాన్ భూమి సమితి, జాతీయ దళిత మహాసభ పంచాయతీ చైర్మన్ ఇంద్రేష గజ్బియే మాట్లాడుతూ దళిత జాతి ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండాలన్నారు. రిజర్వేషన్లు లేని విభాగాల్లోనూ వాటిని అమలు చేయాలన్నారు. అంబేద్కర్ పంచతీర్థాలకు పనె్నండేళ్ల పోరాట కృషికి కేంద్ర ప్రభుత్వం రూ. 130 కోట్లు మంజూరు చేయటం దళితుల విజయం అన్నారు. పంచతీర్థాలను ప్రతి దళితుడు దర్శించుకోవాలన్నారు.