బ్లాక్ మెయిల్ ముఠా అరెస్టు
Published Friday, 10 June 2016హైదరాబాద్, జూన్ 9: జూనియర్ ఆర్టిస్టు కాలె శ్రీనివాస్ కిడ్నాప్ కేసులో 13 మంది నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ‘స్టూడియో9’ టివి ఛానెల్ సిఇఓ శివకుమార్, సిఐడి హోంగార్డ్ జగదీష్ ఉన్నారు. ఇటీవల జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ తన ఫ్లాట్లో వ్యభిచారం నడిపిస్తున్నాడంటూ బెదిరించి ఈ ముఠా అతణ్ణి రూ.రెండు లక్షలు డిమాండ్ చేసింది. ఆ మొత్తం ఇవ్వకపోవటంతో అతణ్ణి ఏకంగా కిడ్నాప్ చేసింది. ఎలాగోలా బయటపడ్డ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.