పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలకు శిక్షణ
Published Tuesday, 7 June 2016హైదరాబాద్, జూన్ 6: గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. ఔత్సాహిక గిరిజన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యున్డిపి)తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సచివాలయంలో సోమవారం గిరిజనాభివృద్ధి అధికారులు, యుఎన్డిపి అధికారుల మధ్య ఒప్పందం కుదిరి, పరస్పరం ఒప్పంద పత్రాలను అందజేసుకున్నారు.