రూ.10 లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
Published Tuesday, 7 June 2016మచిలీపట్నం, జూన్ 6: అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లపై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.10లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు నిల్వ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బెల్లంకొట్ల సందులో గిల్లి కిషోర్ అనే వ్యక్తి గత కొంత కాలంగా పట్టణంలోని బడ్డీ కొట్లకు అక్రమంగా గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. అందిన సమాచారం మేరకు దాడి చేసినట్లు విజిలెన్స్ డియస్పి ఆర్ విజయపాల్ తెలిపారు.