-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ప్రిటోరియా, ఆగస్టు 8: ముంబయి బ్యాట్స్మన్ శ్రేయాస్ అయ్యర్ అజేయ సెంచరీతో భారత్-ఏ జట్టు, దక్షిణాఫ్రికా-ఏ జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి నాలుగేళ్ల క్రితం గెలిచిన ట్రై సిరీస్ ట్రోఫీని తిరిగి నిలబెట్టుకొంది. ఇంతకు ముందు జరిగిన నాలుగు రౌండ్ రాబిన్ మ్యాచ్లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయని అయ్యర్ ఫైనల్ మ్యాచ్లో మాత్రం చెలరేగి పోయాడు.
లండన్, ఆగస్టు 8: ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆథ్లెటిక్ చాంపియన్షిప్స్లో జమైకాకు చెందిన ఒమర్ మెక్ లియోడ్ 110 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకం సాధించి రియో ఒలింపిక్స్లో ఈ విభాగంలో సాధించిన స్వర్ణ పతకానికి తోడు మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ఈ పతకాన్ని అతను తన తల్లికి, సూపర్స్టార్ ఉసేన్ బోల్ట్కు అంకితమిచ్చాడు.
న్యూఢిల్లీ, ఆగస్టు 8: చైనాలోని జినాన్లో జరుగుతున్న ఎటిపి చాలెంజర్ ఈవెంట్లో భారత టెన్నిస్ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేని సహా ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు తొలి రౌండ్లోనే ఘోరంగా చతికిలబడి భారత అభిమానులను తీవ్రంగా నిరాశపర్చారు. అయితే యువ ఆటగాడు విష్ణు వర్థన్ మాత్రం శుభారంభాన్ని సాధించి పరువు నిలబెట్టాడు.
న్యూఢిల్లీ, ఆగస్టు 8: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించాలని ఎదురు చూస్తున్న తనకు భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్తో పాటు లీ చోంగ్ వెయి, లిన్ దాన్ లాంటి లెజెండరీ ఆటగాళ్ల నుంచి విషమ పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉందని ఒలింపిక్ కాంస్య పతక విజేత విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) అభిప్రాయపడ్డాడు.
కొచ్చి/న్యూఢిల్లీ, ఆగస్టు 7: టీమిండియా క్రికెటర్ ఎస్.శ్రీశాంత్ (34) కు కేరళ హైకోర్టులో సోమవారం పెద్ద ఊరట లభించింది. స్పాట్-్ఫక్సింగ్కు పాల్పడ్డాడన్న అభియోగాల ఆధారంగా శ్రీశాంత్పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని కేరళ హైకోర్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)ను ఆదేశించింది.
కొచ్చి, ఆగస్టు 7: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) స్పాట్-్ఫక్సింగ్ వ్యవహారంలో తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని తొలగించాలని కేరళ హైకోర్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ఆదేశించడం పట్ల శ్రీశాంత్తో పాటు అతని భార్య భువనేష్ కుమారి హర్షాన్ని వ్యక్తం చేశారు. ‘ఇది ఎంతో మంచి వార్త. హైకోర్టు తీర్పు నాకు ఎంతో ఊరటనిచ్చింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఫిలిప్పీన్స్లోని పుయెర్టో ప్రినె్సకాలో జరుగుతున్న ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత్ను ఊరించిన పసిడి పతకం చివరికి అందకుండా పోయింది. ఈ పోటీల్లో ఫైనల్కు చేరుకున్న భారత బాక్సర్లు సతేందర్ రావత్ (80+ కిలోల విభాగం), మొహిత్ ఖతానా (80 కిలోలు) చివరి బౌట్లలో రజత పతకాలతో సంతృప్తి చెందడమే ఇందుకు కారణం.
న్యూఢిల్లీ, ఆగస్టు 7: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) పాలకుల కమిటీ (సిఓఎ) బుధవారం న్యూఢిల్లీలో బోర్డు ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని నిర్వహించనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్కు బిసిసిఐ చెల్లించాల్సిన కోట్లాది రూపాయల దీర్ఘకాలిక బకాయిల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
రోమ్, ఆగస్టు 7: ఇటలీకి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్శ్లామ్ టోర్నీ మాజీ ఫైనలిస్టు సరా ఎరానీ (30) డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. పురుష హార్మోన్ ‘టెస్టోస్టిరాన్’ను ఉనికిని గోప్యంగా ఉంచేందుకు ఉపయోగించే హార్మోన్ పరీక్షలో ఆమె విఫలమైందని ఇటలీ వార్తా పత్రికలు సోమవారం వెల్లడించాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 7: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీయే ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మన్ అని పాకిస్తాన్ ఫాస్ట్బౌలర్ మహమ్మద్ అమీర్ అభిప్రాయ పడ్డాడు. ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అమీర్ ఈ విషయం చెప్పాడు.