S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

08/19/2017 - 22:40

‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ ఒక జర్నలిస్టు ప్రశ్నకు చిత్రంగా స్పందించాడు. 2016లో జరిగిన టి-20 వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడింది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత విలేఖరుల సమావేశంలో ధోనీ పాల్గొన్నాడు. ఒక్కో ప్రశ్నకు నింపాదిగా సమాధానమిస్తున్న ధోనీని ‘ఎప్పుడు రిటైర్ అవుతారు? అంతర్జాతీయ కెరీర్‌ను ముగించడానికి ఇదే సరైన సమయమని అనుకుంటున్నారా?’ అని ప్రశించాడు.

08/19/2017 - 22:40

ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ను వివాదాల రారాజుగా చెప్పుకోవాలి. సమర్థుడైన పేసర్‌గా కంటే, వివాదాలను కొనితెచ్చుకునే క్రికెటర్‌గా అతనికి ఎక్కువ పేరు ఉంది. 2012లో బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో వెళుతున్నప్పుడు అతను తోటి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. అతనిని దూషించాడు. అత్యవసర ద్వారానికి సమీపంలో కూర్చోవద్దని సూచించిన విమాన సిబ్బందిపైనా ఒంటికాలిపై లేచాడు.

08/19/2017 - 22:39

* సెలక్టర్లను ‘జోకర్ల గుంపు’ అని విమర్శించి మహీందర్ అమర్‌నాథ్ బిసిసిఐ అధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఒక సిరీస్‌లో ఎంత అద్భుతంగా ఆడినప్పటికీ, ఆ తర్వాతి సిరీస్‌లోనే ఉద్వాసనకు గురికావడం అతనిని ఆగ్రహానికి గురి చేసింది. ఒకసారికాదు.. రెండుసార్లు కాదు.. ప్రతిసారీ జట్టులోకి తీసుకోవడం, కారణం లేకుండానే తొలగించడం అతని సహనానికి పరీక్ష పెట్టింది.

08/12/2017 - 21:13

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న సాకర్‌కు సుమారు దశాబ్దకాలంగా బాడ్మింటన్ సవాళ్లు విసురుతున్నది. ప్రజాభిమానాన్ని రోజురోజుకూ పెంచుకుంటూ, సాకర్ తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించే క్రీడగా ఎదిగింది. వివిధ దేశాలకు విస్తరిస్తున్నది. త్వరలోనే ఫుట్‌బాల్‌ను అధిగమించి, ఎక్కువ మంది అభిమానులున్న క్రీడగా అవతరించే అవకాశం లేకపోలేదు.

08/12/2017 - 21:12

గత ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం సాధించిన సైనా ఈసారి అంతకంటే మెరుగైన స్థానాన్ని అందుకుంటుందా? కనీసం రజత పతకాన్ని కాపాడుకుంటుందా? అన్న ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. అతిక్ జౌహరీ వద్ద బాడ్మింటన్‌లో ఒనమాలు దిద్దుకున్న సైనా ఆతర్వాత పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలింది. తర్వాతి కాలంలో గోపీచంద్‌తో అభిప్రాయభేదాలు రావడంతో తన ప్రాక్టీస్ వేదికను బెంగళూరుకు మార్చుకుంది.

08/12/2017 - 21:12

ప్రపంచ బాడ్మింటన్‌లో చైనా ఆధిపత్యం కొనసాగున్నది. అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన దేశాల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మొత్తం 61 పతకాలు చైనా ఖాతాలో ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న ఇండోనేషియా 21 పతకాలు గెల్చుకున్నదంటే, చైనా ఏ స్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నదో ఊహించుకోవచ్చు. డెన్మార్క్, దక్షిణ కొరియా చెరి పది పతకాలతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.

08/12/2017 - 21:11

ప్రపంచ కప్ చాంపియన్‌షిప్స్ 1977లో మొదటిసారి జరగ్గా, మాల్మో (స్వీడన్) ఆతిథ్యమిచ్చింది.

08/12/2017 - 21:11

చైనా ఆటగాడు లిన్ డాన్‌ను సూపర్ డాన్ అని పిలుస్తారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో అతను ఐదు పర్యాయాలు సింగిల్స్ విభాగంలో స్వర్ణాలను సాధించాడు. పార్క్ జో బాంగ్, జావో యునె్లయ్ కూడా తమతమ కెరీర్‌లో ఐదేసి పతకాలను గెల్చుకున్నప్పటికీ, అవి సింగిల్స్ ఈవెంట్‌లో కాదు.

08/12/2017 - 21:11

చైనాలో బాడ్మింటన్‌ను ‘తీ జియాన్ జీ’ పేరుతో ఆడేవారు. ఇందులో షటిల్‌కాక్‌ను ర్యాకెట్‌తో కాకుండా కాళ్లతో కొట్టేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్న ఆ క్రీడ స్థానంలోనే ఆధునిక బాడ్మింటన్ విస్తరించింది.

08/12/2017 - 21:10

బాడ్మింటన్ మ్యాచ్‌లు సహజంగా అరగంటకుపైగానే జరుగుతాయి. కానీ, కేవలం ఆరు నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్ కూడా ఉంది. దక్షిణ కొరియా క్రీడాకారిణి రా క్యుంగ్ మిన్, ఇంగ్లాండ్‌కు చెందిన జూలియా మాన్ మధ్య జరిగిన పోరు పట్టుమని పది నిమిషాలు కూడా సాగలేదు. కాగా, సన్ జున్ (చైనా), పీటర్ రస్మున్‌సెన్ (డెన్మార్క్) మధ్య 124 నిమిషాల పాటు సుదీర్ఘమైన మ్యాచ్ జరిగింది.

Pages