S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యువ
ఏ విషయంలోనైనా మితి మీరితే అవస్థలు అనివార్యం కాకతప్పదు. అందుకే ‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్నారు పెద్దలు. పరిధులు, పరిమితులు దాటితే ఉపయోగం కన్నా లేనిపోని సమస్యలు తప్పవు. మన పెద్దలు ఏనాడో చెప్పిన ఈ సూత్రం నేటి ఆధునిక యుగంలో స్మార్ట్ఫోన్లకు నూటికి నూరుపాళ్లూ వర్తిస్తుంది. సాధారణ ఫోన్లు కనుమరుగవుతూ ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు కనిపిస్తున్నాయి.
మైక్రోసాఫ్ట్ నుంచి అతి త్వరలో అత్యంత తక్కువ ధరకే అత్యాధునిక ల్యాప్టాప్ దూసుకురానుంది. లెనెవో, జెపి సంస్థలతో కలిసి మైక్రోసాఫ్ట్ అతి త్వరలోనే రూ.12వేల ప్రారంభ ధరలో విండోస్ 10, విండోస్ 10 ఎస్ పేరిట విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ ల్యాపీని ఆవిష్కరిస్తోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది.
ప్రఖ్యాత కార్బన్ కంపెనీ తన నూతన స్మార్ట్ఫోన్ టైటానియం ఫ్రేమ్స్ ఎస్7ను తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్ను వినియోగదారులు షాప్క్లూస్ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని ధరను కంపెనీ రూ.6999గా నిర్ణయించింది. 5.5 అంగుళాల డిస్ప్లే, 3 జిబి ర్యామ్, 13 మెగా పిక్సెల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు తదితర ఆకర్షణీయమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ను ఏర్పాటుచేశారు.
స్వాతంత్య్రం వచ్చాక మన దేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడటానికి, ఆ తరువాతి పరిణామాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ విశేషాలు కొందరికి తెలుసు.. కొందరికి తెలియకపోవచ్చు. నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని అంశాలపై సమాచారం ఎంతవరకు తెలుసో కనుగొనేందుకు ఈ ‘క్విజ్’...
1. ఏ దేశం రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే భావనలు తీసుకోబడ్డాయి?
కుర్రకారే కాదు, అన్ని వయసుల వారూ నేడు స్మార్ట్ఫోన్లు వాడుతూ ‘అంతర్జాలం’లో విహరిస్తున్నందున మొబైల్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. యాప్స్ను డౌన్లోడ్ చేసుకునే విషయంలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, అమెరికాను వెనక్కి నెట్టేసి భారత్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించిందని ‘యాప్ ఎన్నీ’ సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది.
విద్యార్థులైనా, ఉద్యోగులైనా.. ఏ వర్గం వారైనా, ఏ వయసు వారైనా తమకు అవసరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు ‘గూగుల్ సెర్చి’పై ఆధారపడడం నేడు అలవాటుగా మారింది. ‘నెట్’లో ‘శోధన’కు కేవలం గూగుల్నే ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నేటి సాంకేతిక యుగంలో ఇలాంటి ‘సెర్చి ఇంజన్లు’ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ‘గూగుల్’ తర్వాత ద్వితీయ స్థానాన్ని ఆక్రమించిన సెర్చి ఇంజన్- ‘బింగ్’.
రెగట్టా పోటీల్లో అద్భుతాలు సాధిస్తూ మేటి ‘సైలర్’గా గుర్తింపు తెచ్చుకున్న పదిహేనేళ్ల ఆ కుర్రాడు అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తానని ధీమాగా చెబుతున్నాడు.. భవిష్యత్లో నేవీ అధికారిగా దేశానికి సేవలందిస్తానని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు.. హైదరాబాద్లోని రసూల్పురాలో పేద కుటుంబానికి చెందిన ఎర్రా దుర్గాప్రసాద్ ‘ఆర్మీ బోయిస్ స్పోర్ట్స్ కంపెనీ’కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తన ఇంటి ముంగిట ఓ ‘విశిష్ఠ అతిథి’కి సాదర స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. దేశవ్యాప్తంగా సుమారు 17వేల కిలోమీటర్ల మేర ఒంటరిగా ‘బైక్యాత్ర’ చేస్తున్న ఆమె సాహసాన్ని ఆయన మనసారా అభినందించారు. అంగవైకల్యం పొందిన సైనికుల పట్ల సమాజంలో అవగాహన పెరగాలన్న ఆకాంక్షతో ముందుకు సాగుతున్న ఆమెకు మద్దతు పలికారు.
ఈ కాలంలో ఎవరివద్దయినా స్మార్ట్ఫోన్ ఉందంటే.. కచ్చితంగా అందులో ‘ఫేస్బుక్’ యాప్ ఉండి తీరాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్ రికార్డు స్థాయి వినియోగదారులతో నానాటికీ ముందుకు దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త అప్డేట్స్ను, ఫీచర్లను పరిచయం చేస్తూ ఈ ‘సామాజిక వేదిక’ ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా ఫేస్బుక్ మరో పెద్ద అప్డేట్ను తీసుకురాబోతోంది.
చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం ‘వన్ ప్లస్’ తన వన్ ప్లస్ 5టి స్మార్ట్ఫోన్కు ‘లావా రెడ్ ఎడిషన్ వేరియెంట్’ను తాజాగా విడుదల చేసింది. ముందు భాగంలో నలుపురంగుతో, వెనుక భాగంలో ఎరుపు రంగుతో అందమైన ఫినిషింగ్ ఇచ్చారు. ఇటీవలే వన్ప్లస్ 5టి స్టార్వార్స్ ఎడిషన్ భారత్లో విడుదల కాగా, ఇప్పుడు ఈ వేరియెంట్ను వన్ప్లస్ విడుదల చేసింది.