S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చెన్నై, డిసెంబర్ 4: తమిళనాడు ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో పరిస్థితి విషమంగా మారింది. ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి ప్రకటించిన కొద్దిసేపటికే అమ్మకు గుండెపోటు వచ్చిందని, ఐసియుకు తరలించినట్లు అపోలో ఆసుపత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేయటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
అమృత్సర్, డిసెంబర్ 4: ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కనె్నర్ర జేశారు. ఉగ్రవాద శక్తులపైనే కాకుండా వారికి మద్దతు ఇచ్చే, ఆశ్రయం కల్పించే, శిక్షణ, నిధులు సమకూర్చే వారిపైన కూడా కలిసికట్టుగా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ పరోక్షంగా పాకిస్తాన్పై విమర్శలు గుప్పించారు.
విజయవాడ, డిసెంబర్ 4: జల వివాదాలు వైఎస్ పుణ్యమేనని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఎగువ రాష్ట్రాలు ఇష్టారీతిన ప్రాజెక్టులు కడుతున్నా అప్పటి వైఎస్ సర్కార్ కళ్లు మూసుకు కూర్చుందని, ఫలితం ఇప్పుడనుభవిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల పంపకంపై బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో నియమించిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం మంత్రి దేవినేని నేతృత్వంలో విజయవాడలో ఆదివారం సమావేశమైంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: త్వరలోనే కొత్తగా రూ.20, రూ.50 నోట్లను ప్రవేశపెడుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లు కూడా చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. రూ.500, రూ.1000 నోట్లను హఠాత్తుగా రద్దు చేసిన నెలరోజుల తరువాత ఆర్బీఐ తాజా ప్రకటన చేసింది.
విశాఖపట్నం, డిసెంబర్ 4: గ్రూప్ 3 నోటిఫికేషన్ను ఈ నెలాఖరుకు జారీ చేస్తామని ఎపిపిఎస్సి చైర్మన్ పి ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. విశాఖ వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. గ్రూప్ 3 ద్వారా 1,055 పోస్టులు భర్తీ చేయనున్నట్టు చెప్పారు.
సూళ్లూరుపేట, డిసెంబర్ 4: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 7న పిఎస్ఎల్వి-సి 36 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ప్రయోగానికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్ఆర్) సోమవారం డాక్టర్ బిఎన్ సురేష్ అధ్యక్షతన షార్లో జరగనుంది.
బ్యాంకాక్, డిసెంబర్ 4: ఆసియా కప్ మహిళల టి-20 క్రికెట్ చాంపియన్షిప్లో భారత్ మరోసారి ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ను 17 పరుగుల తేడాతో ఓడించి, వరుసగా ఆరోసారి టైటిల్ను సాధించింది. అరుదైన ‘డబుల్ హ్యాట్రిక్’ను నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 121 పరుగులు సాధించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: లోధా కమిటీ సిఫార్సులను అమలుపై సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సోమవారం విచారణకు రానున్న ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తుది తీర్పునిచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ కొన్ని అంశాలను వాయిదా వేసినా, కొన్ని కీలక సిఫార్సులపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు ఆదేశాలు జారీ చేయవచ్చని అంటున్నారు.
సిడ్నీ, డిసెంబర్ 4: చాపెల్-హాడ్లీ ట్రోఫీ వనే్డ క్రికెట్ సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియా 68 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. స్టీవెన్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి దీటుగా కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిన్ కూడా శతకాన్ని నమోదు చేసినప్పటికీ తన జట్టును ఆదుకోలేకపోయాడు.
మకావూ, డిసెంబర్ 4: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో జావో జున్ పెంగ్, మహిళల సింగిల్స్లో చెన్ యూఫై టైటిళ్లు కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో పెంగ్ 21-11, 21-19 ఆధిక్యంతో వరుస సెట్లలో టాప్ సీడ్ చౌ తియెన్ చెన్కు షాకిచ్చాడు. మొదటి సెట్ను సులభంగానే సొంతం చేసుకున్న పెంగ్కు రెండో సెట్లో చెన్ నుంచి ప్రతిఘటన ఎదురైంది.