S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/22/2017 - 02:14

కాకినాడ, అక్టోబర్ 21: దేశ రక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషి అజరామరమని, విధి నిర్వహణలో వారి ప్రాణాలను పణంగా పెట్టి సమాజానికి సేవ చేస్తున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు బాసటగా నిలవాలని కోరారు.

10/22/2017 - 02:12

తిరుపతి, అక్టోబర్ 21: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తుల రద్దీ శనివారం అనూహ్యంగా పెరిగింది. బుధవారం నాటికి పెరటాసి మాసం ముగిసినప్పటికీ ఐదో శనివారం రావటంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. రెండు వైకుంఠ క్యూ కాంప్లక్స్‌లో 51 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయి భక్తులు స్వామి దర్శనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు. దీంతో ఉచిత క్యూలైన్‌లో వెళ్లే భక్తులకు 16 గంటల సమయం పడుతోంది.

10/22/2017 - 02:10

విజయనగరం, అక్టోబర్ 21: రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వౌలిక వసతులు సమకూర్చేందుకు రూ.5వేల కోట్లతో టెండర్లు పిలవనున్నారని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు తెలిపారు. శనివారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి మాదిరిగా తీర్చిదిద్దుతామన్నారు.

10/22/2017 - 02:09

అమరావతి, అక్టోబర్ 21: ‘మీరు ఒంటరి కాదు. మీ వెనుక ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీ వెనుక చంద్రబాబునాయుడున్నాడు. దుబాయిలో ఎన్నార్టీ మీటింగ్ చరిత్రకు నాంది పలకాలి. మీరంతా ఏపి ఎన్నార్టీతో అనుసంధానం కండి. గల్ఫ్ దేశాల్లో ప్రవాసాంధ్రులకు మూడు పథకాలు తెస్తాం. స్కిల్ డెవలెప్‌మెం ట్ ఇస్తాం.

10/21/2017 - 04:49

హిరమండలం, అక్టోబర్ 20: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలో నీటిమట్టం పెరుగుతోంది. వాయుగుండం ఒడిశా ప్రాంతానికి తరలడంతో కురిసిన వర్షాలకు శుక్రవారం వరదనీరు చేరుతుండడంతో గొట్టాబ్యారేజీ అధికారులు నది దిగువ భాగానికి నీటిని విడిచిపెడుతున్నారు. బ్యారేజ్ వద్ద 22 గేట్లను 20 సెంటీమీటర్లు ఎత్తి నది దిగువ భాగానికి నీటిని విడుదల చేస్తున్నారు.

10/21/2017 - 04:47

రామచంద్రపురం, అక్టోబర్ 20: రామచంద్రపురం పట్టణంలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ నేత నందుల సూర్యనారాయణ అలియాస్ రాజు కుమార్తె జయదీపిక హత్య కేసులో తండ్రే హంతకుడని పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 16వ తేదీ రాత్రి చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనలో తన కుమారుడే ఈ హత్యచేసి ఉండవచ్చని రాజు పోలీసులకు ఫిర్యాదుచేశాడు.

10/21/2017 - 04:46

హైదరాబాద్, అక్టోబర్ 20: ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.2.05 లక్షల కోట్లకు చేరుకోవడం పట్ల ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి ఆందోళన చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దుబారా అంతా ఇంతా కాదని, అభివృద్ధి సంగతి పక్కన పెట్టి అప్పులను పెంచి రాష్టాన్ని ఎక్కడికి తీసుకువెళుతున్నారని ఆ పార్టీ శాసనసభ్యుడు, పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు.

10/21/2017 - 04:08

రాయవరం, అక్టోబర్ 20: పాలకేంద్రాల మాదిరిగానే గ్రామాల్లో కల్లు అంగళ్లు ఏర్పాటుచేయాలని యోచిస్తున్నామని రాష్ట్ర కల్లుగీత కార్మికుల కార్పొరేషన్ ఛైర్మన్ టి జయప్రకాష్ నారాయణగౌడ్ తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాయవరం మండలం కురకాళ్లపల్లి వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో కల్లును నిల్వ చేయడానికి చిల్లింగ్ యూనిట్లు ఏర్పాటుచేసే అలోచన ఉందన్నారు.

10/21/2017 - 04:08

విజయవాడ (బెంజిసర్కిల్), అక్టోబర్ 20: విభజన తరువాత రాష్ట్రం అప్పుల ఉబిలో ఉంటే దానిని పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చార్టెడ్ ఫ్లైట్‌ల్లో షికారు చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ విమర్శించారు.

10/21/2017 - 04:08

ఒంగోలు, అక్టోబర్ 20: ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చెర్లకోట గ్రామ శివారులో ఉన్న గొంగటికొండలో ఉన్న పులిగుహలో గుప్తనిధులకోసం తవ్వకాలు జరుపుతున్న సుమారు 64మంది ముఠాను శుక్రవారం పొదిలి పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పి బి సత్యఏసుబాబు తెలిపారు.

Pages