S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/17/2017 - 04:30

కావలి (జలదంకి), సెప్టెంబర్ 16: నెల్లూరు జిల్లాలో కస్టమ్స్ మిల్ల్‌డ్‌రైస్(సిఎంఆర్) బియ్యం ప్రభుత్వానికి అప్పగించే విషయంలో రైస్‌మిల్లర్ల వ్యవహారం అనుమానాస్పదంగా ఉంది. కావలి పరిధిలో ఏడు రైస్ మిల్లుల నుంచి ప్రభుత్వానికి సుమారు 5,250 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉన్నప్పటికీ సంబంధిత యంత్రాంగం వారి నుంచి బియ్యాన్ని రాబట్టడంలో విఫలవౌతోంది.

09/17/2017 - 04:29

విశాఖపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 16: అందం, అధికారం, ఐశ్వర్యం అశాశ్వతమని, కేవలం ఆధ్యాత్మిక శక్తే శాశ్వతమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. టిఎస్సాఆర్ లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవం శనివారం వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ ఈశ్వరశక్తి అని, కళాకారులను ప్రేమించాలన్నారు.

09/17/2017 - 04:23

అమరావతి, సెప్టెంబర్ 16: రాష్ట్రం విడిపోయి మూడేళ్లు గడిచినా ఏపిలో ఇంకా తెలంగాణ హవా కొనసాగుతుండటంపై అధికారులు, అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కీలకమైన అసెంబ్లీ కార్యదర్శి నియామకంపై ఆంధ్ర ఉద్యోగులు, అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

09/17/2017 - 02:35

పాములపాడు, సెప్టెంబర్ 16: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వరాలయాన్ని శనివారం కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. శ్రీశైలం జలాశయానికి 2 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో నీరు ఒక్కసారిగా ఆలయాన్ని చుట్టుముట్టాయి. దీంతో గర్భగుడిలోని వేపదారు శివలింగం నీట మునిగింది. దీంతో చివరి సారిగా ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ మహాహారతి ఇచ్చారు.

09/17/2017 - 02:31

అమరావతి, సెప్టెంబర్ 16: ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ హెల్త్‌కేర్ విభాగంలో ప్రొఫెసర్‌గా అవకాశం దక్కించుకున్న గుంటూరు నగరంలోని బ్రాడీపేటకు చెందిన కార్తీక్ మిక్కినేని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇక్కడ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉన్నత స్థాయికి ఎదిగి తెలుగుజాతి ప్రతిష్ఠను ఇనుమడింపచేసిన కార్తీక్‌ను ఈసందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.

09/17/2017 - 02:30

విజయవాడ, సెప్టెంబర్ 16: ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలు, ఉపన్యాసాలకు, మూడేళ్ల ఆయన పాలనకూ ఏమాత్రం సంబంధం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. ఆనాటి మోదీకి, ఈనాటి మోదీకి వౌఖికమైన ముఖ తేడా తప్ప మేకవనె్న పులిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతోన్మాద, ఆర్థిక అరాచకాలతో పాలన సాగిస్తోందని ఆరోపించారు.

09/16/2017 - 23:27

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 16: విశాఖ మాదిరిగా రాజమహేంద్రవరంలో కూడా ఒక భూ కుంభకోణం బయటపడింది..ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించడంతో రూ. కోట్ల విలువ చేసే ఈ భూమి కబ్జా కోరల్లోంచి బయట పడింది.

09/16/2017 - 23:25

విజయవాడ, సెప్టెంబర్ 16: ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ (ఆర్‌సిఇపి) వంటి ఒప్పందాలతో దేశ ప్రజలపై దోపిడీ మరింత తీవ్రమవుతుందని ‘జనశక్తి’ సంపాదకుడు పి జస్వంతరావు అన్నారు. ఏఐఎఫ్‌టియు (న్యూ), రైతుకూలీ సంఘం (ఆం.ప్ర), నవయువ సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం నగరంలోని కందుకూరి కల్యాణ మండపంలో కార్మిక, రైతుకూలీ, యువజనుల రాష్టస్థ్రాయి సదస్సు జరిగింది.

09/16/2017 - 23:25

చిత్తూరు, సెప్టెంబర్ 16: జిల్లా కేంద్రాల్లోని పలు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న ఆలోచలో ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శనివారం చిత్తూరు ప్రధాన ఆసుపత్రిలో జరిగిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో మంత్రి పాలుపంచుకున్నారు.

09/16/2017 - 23:24

విజయవాడ, సెప్టెంబర్ 16: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 21 నుండి 30 వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. తొలుత 19వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, తాగునీటి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ‘స్వచ్ఛతా హీ సేవ’ అనే పరిశుభ్రతా ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల 15 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి.

Pages