S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/24/2019 - 00:28

న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతాన్నిచ్చే అనేక కీలక నిర్ణయాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శుక్రవారంనాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె దేశ ఆర్థికాభివృద్ధి విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రపంచ వృద్ధి కంటే కూడా భారత జీడీపీ వేగంగానే విస్తరిస్తోందని ఆమె పేర్కొన్నారు.

08/23/2019 - 23:54

విశాఖపట్నం, ఆగస్టు 23: ఉత్పాదక వ్యయం తగ్గించుకుంటేనే నాణ్యమైన ఉక్కు ఉత్పత్తులను అందుబాటు ధరలకు మార్కెటింగ్ చేసుకుంటేనే ఉక్కు పరిశ్రమ మనుగడ సాధించగలుగుతుందని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) సీఎండీ ప్రదోష్ కుమార్ రథ్ అభిప్రాయపడ్డారు.

08/23/2019 - 23:39

న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశ ఆర్థిక వ్యవస్థపై నీతి అయోగ్ వైస్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. గత 70 ఏళ్లలో ఏ ఒక్కరూ ఎదుర్కోని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ తయారైందని నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గురువారం వ్యాఖ్యలపై సీతారాం ఏచూరి స్పందించారు. ‘దేశ ఆర్థికరంగం ప్రమాదంలో పడిపోయింది..

08/23/2019 - 23:37

హైదరాబాద్, ఆగస్టు 23: హైదరాబాద్ రియాల్టీ మార్కెట్ మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మార్కెట్ లావాదేవీలు పెరిగాయి. ఈ వివరాలను ప్రోపర్టీ పోర్టల్ 99కామ్ పేర్కొంది. రెసిడెన్షియల్ అపార్టుమెంట్ సగటు ధరలు స్వల్పంగా ఒక శాతం పెరిగాయి.

08/23/2019 - 23:24

వాషింగ్టన్, ఆగస్టు 23: మళ్లీ ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను కమ్ముకుంటోందా? 2007-08 నాటి పరిస్థితులు పునరావృతం కాబోతున్నాయా? ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులను లోతుగా పరిశీలిస్తే ఈ వాస్తవమే కళ్లకు కడుతోంది. అదుపుతప్పుతున్న ఆర్థిక వ్యవస్థను దారికి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలేవీ అనుకున్న ఫలితాలు ఇచ్చే సూచనలు కనిపించడం లేదు.

08/23/2019 - 23:01

న్యూఢిల్లీ, ఆగస్టు 23: బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల బంగారంపై రూ. 25 పెరిగి మొత్తం ధర రికార్డు స్థాయి గరిష్టం రూ. 38.995కు చేరింది. రూపాయి బలహీన పడటమే ఇందుకు కారణమని వాణిజ్య వర్గాలు పేర్కొన్నాయి. గత మంగళవారం నుంచి బంగారం ధరలు ప్రతి రోజూ సరికొత్త గరిష్ట స్థాయిని నమోదు చేస్తున్నాయి. కాగా, వెండి ధరల్లో మాత్రం స్థిరత్వం కొనసాగుతోంది.

08/23/2019 - 22:59

ముంబయి, ఆగస్టు 23: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయంగా కోలుకున్నాయి. వరుసగా మూడు రోజుల నష్టాలతో సతమతమైన మార్కెట్లకు విదేశీ పెట్టుబడులపై పన్ను విషయంలో కొన్ని సరళరత నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చన్న ఊహాగానాలు ఊతమిచ్చాయి. అలాగే ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చే కొన్ని చర్యలకు సైతం ఎట్టకేలకు ప్రభుత్వం సానుకూలతతో ఉందన్న అంచనాలు సైతం మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపాయి.

08/23/2019 - 06:29

ముంబయి : ఆర్థిక మాంద్యం కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన రంగాలను పునరుత్తేజం చేసేందుకు ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద ప్రత్యేక ప్యాకేజీలేవని అధికారులు తేల్చిచెప్పడం స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. బ్యాంకింగ్, వాహన, లోహ స్టాక్స్‌లో గురువారం మరోదఫా అమ్మకాల వత్తిడి నెలకొనడంతో దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి.

08/23/2019 - 06:03

విశాఖపట్నం, ఆగస్టు 22: దేశీయంగా పండిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ త్వరలోనే మార్కెట్‌లో ప్రత్యక్షం కానుంది. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేపట్టి ఫలసాయం పొందనున్నారు. రైతులకు అత్యంత లాభదాయకమైన ఈ పంటపై ఇప్పుడిప్పుడే ఉద్యానవన శాఖ దృష్టి సారించి, రైతులను ఆ దిశగా సాగుకు ప్రోత్సహిస్తోంది. మధ్య అమెరికా తదితర ప్రాంతాలకే పరిమితమైన డ్రాగన్ ఫ్రూట్‌ది ఒక ప్రత్యేక స్థానం.

08/23/2019 - 05:39

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఎగుమతులను మరింతగా పెంచేందు వీలుగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ త్వరలో సరికొత్త వాణిజ్య విధానాన్ని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి 2020-25 పంచవర్ష ప్రణాళికతో కూడిన సరికొత్త విధానానికి రూపకల్పన జరుగుతోందని సంబంధిత అధికారులు గురువారం నాడిక్కడ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహానికి రాయితీలు కల్పించేదుకు ఈ కొత్త విధానంలో మార్గదర్శకాలను పొందుపరుస్తారని వెల్లడించారు.

Pages