S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/04/2019 - 23:14

ముంబయి, జూలై 4: ఈ ఏడాది దేశ ఆర్థికాభివృద్ధి ఐదేళ్ల కనిష్ట స్థాయి నుంచి 7 శాతానికి పెరుగుతుందన్న ఆర్థిక సర్వే నివేదికలతో దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఊతం లభించింది. దీంతో సూచీలు వరుసగా నాలుగో రోజైన గురువారం సైతం ఓ మోస్తరు లాభాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 68.81 పాయింట్ల ఆధిక్యతతో 0.17 శాతం లాభపడి 39,908.06 పాయింట్ల గరిష్ట స్ధాయిలో స్థిరపడింది.

07/04/2019 - 23:10

న్యూఢిల్లీ, జూలై 4: మొండి రుణాల శాతాన్ని తగ్గించడంతో గడిచిన ఏడాది బ్యాంకింగ్ రంగ పనితీరు మెరుగుపడిందని ఆర్థిక సర్వే నివేదిక పేర్కొంది. ఐతే నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంతోబాటు, వౌలిక మార్కెట్ల నుంచి ఏర్పడిన వత్తిడుల కారణంగా ఆర్థిక రాబడి కొంతమేరకే పరిమితమైందని గురువారం పార్లమెంటుకు సమర్పించిన 2018-19 ఆర్థిక సర్వే వెల్లడించింది.

07/04/2019 - 23:19

న్యూఢిల్లీ, జూలై 4: రాబోయే 5జీ సాంకేతికత దేశంలో పరిశ్రమల యాజమాన్యాలు అంతర్జాతీయ మార్కెట్లను అందిపుచ్చుకోవడానికి సువర్ణావకాశం కానుందని 2018-19 ఆర్థిక నివేదికలు స్పష్టం చేశాయి. ప్రథానంగా డిజిటల్ చెల్లింపులు, వైజ్ఞానిక, సేవా పరమైన ఆర్థికాభివృద్ధిని పారిశ్రామికులు సంతరించుకునే అవకాశాలున్నాయని ఆ సర్వే పేర్కొంది.

07/04/2019 - 23:06

న్యూఢిల్లీ, జూలై 4: దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో మందగించిన పర్యాటక రంగాభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే నివేదికలు సూచించాయి. ఇందుకోసం ప్రభుత్వంతోబాటు వివిధ రంగాలు సమష్టి భాగస్వామ్యంతో కృషి చేయాలని సూచించింది.

07/04/2019 - 04:26

హైదరాబాద్, జూలై 3: సమష్టి కృషితోనే సింగరేణి బొగ్గు గనులను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ కోరారు. ఆయన కార్మిక యూనియన్ నేతలతో పాటు ఉద్యోగులతో బుధవారం జరిపిన చర్చల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

07/04/2019 - 04:20

హైదరాబాద్, జూలై 3: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 2017, 2018 సంవత్సరాలకు 26.74 కోట్ల రూపాయలు లాభం ఆర్జించింది. ఈ లాభంలో డివిడెండ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి 1.75 కోట్ల రూపాయలు లభించాయి. ఈ మేరకు ఒక చెక్కును వ్యవసాయ, గిడ్డంగుల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల శామ్యేల్ బుధవారం అందించారు.

07/03/2019 - 22:38

ముంబయి, జూలై 3: మరోరోజు వ్యవధిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ తీరుపై వస్తున్న పలు రకాల ఊహాగానాల నేపథ్యంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురై చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. దీంతో వరుసగా మూడోరోజూ సూచీలు లాభాల బాటలోనే సాగినటైంది.

07/03/2019 - 22:35

న్యూఢిల్లీ, జూలై 3: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు బుధవారం గణనీయంగా పెరిగాయి. 10 గ్రాములపై రూ. 280 పెరిగి మొత్తం ధర 34,380కి చేరింది. అంతర్జాతీయంగా ఇనె్వస్టర్లు అధికంగా బంగారంపై మదుపు చేసేందుకు ఆసక్తి చూపడంతోబాటు, దేశీయంగా డిమాండ్ పెరగడం బంగారం ధర పెరిగేందుకు దోహదం చేసింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర గరిష్టంగా 1,425 డాలర్లు పలికింది.

07/03/2019 - 22:27

న్యూఢిల్లీ, జూలై 3: బిల్డర్లు, ప్రమోటర్లు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద రిజిస్టరు చేసుకోకుండా ప్లాట్లు, భవనాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును విక్రయించేందుకు వీలు లేదని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి స్పష్టం చేశారు.

07/03/2019 - 04:48

హైదరాబాద్: కస్టమర్లకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందేందుకు ఎస్‌బీఐ కృషి చేస్తుందని ఆ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ మణి పాల్విసన్ చెప్పారు. మంగళవారం ఇక్కడ అమరావతి సర్కిల్‌కు సంబంధించి బ్యాంకు 64వ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు డిజిటల్ సేవలను అందించడంలో అగ్రగామిగా ఉందన్నారు. యోనో క్యాష్ సేవలు కస్టమర్లలో పాపులర్ అయినట్లు ఆయన చెప్పారు.

Pages