-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: భారత్లో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ, ప్రముఖ మానవహక్కుల న్యాయవాది ఇందిరా జైసింగ్లను 2018 సంవత్సరానికి ప్రపంచంలో గొప్ప నాయకులుగా ఫార్చూన్ మ్యాగజైన్ పేర్కొంది. ప్రపంచంలో మొత్తం 50 మంది గొప్ప నాయకుల జాబితాను ఫార్చూన్ మ్యాగజైన్ గురువారం విడుదల చేసింది.
ముంబయి, ఏప్రిల్ 19: అంతర్జాతీయ మార్కెట్లో లోహాల ధరలు పెరగడంతో అందుకు అనుగుణంగా లోహపు (మెటల్) కంపెనీల షేర్లకు భారీగా డిమాండ్ పెరగడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బలపడ్డాయి. స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు ఊగిసలాట మధ్య సాగినప్పటికీ, లోహపు షేర్ల ధరలు పుంజుకోవడం వల్ల కీలక సూచీలు పైకి ఎగబాకాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఈ ఏడాది రూ. 64,539 కోట్ల పన్నులను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదిపైన 31.86 శాతం వృద్ధిరేటు సాధించాలని నిర్ణయించింది. 2017-18లో వస్తు సేవా పన్ను అమలైన తర్వాత రూ. 48,944 కోట్ల పన్నులను వసూలు చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 19: బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోకుండా చూడాల్సిన తరుణం ఆసన్నమైందని, ఆర్థికపరమైన అంశాల్లో ప్రస్తుతం జరుగుతున్న తప్పులను సరిదిద్దకపోతే బ్యాంకులు కునారిల్లుతాయని అఖిల భారత ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐఆర్ఆర్బీఈఏ) సెక్రటరీ జనరల్ ఎస్. వెంకటేశ్వరరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి గురువారం ఆయన ఒక లేఖ రాశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 19: హైదరాబాద్లో పేటీఎం ద్వారా నగదు బదిలీ లావాదేవీల్లో 40 శాతం వృద్ధి చోటు చేసుకుందని ఆ సంస్థ సివోవో కిరణ్ వాసిరెడ్డి తెలిపారు. ఒన్97 కమ్యూనికేషన్స్కు చెందిన పేటమ్ను కిరాణ స్టోర్, పెట్రోల్ పంపులు, ఫార్మసీ, ఆటో,ట్యాక్సీ ఇతర సేవలను పొందినందుకు నగదు బదిలీకి ప్రజలు వినియోగించుకుంటున్నారని ఆయన చెప్పారు.
భీమవరం, ఏప్రిల్ 19: ఆక్వా రాజధానిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆనంద ఫౌండేషన్ నవీన పద్ధతులతో చేపడుతున్న బయోఫ్లాక్ రొయ్యల సాగును విదేశీ శాస్తవ్రేత్తల బృందం గురువారం పరిశీలించింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చేపడుతున్న ప్రోబయోటిక్స్ విధానం కన్నా బయోఫ్లాక్ విధానం రైతులకు ఉపయోగకరమని శాస్తవ్రేత్తలు అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: వడోదరకు చెందిన డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (డీపీఐఎల్) ప్రమోటర్లు, డైరెక్టర్లను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. రూ.2,654 కోట్ల మేర బ్యాకు రుణాలను ఎగ్గొట్టారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ. సురేష్ నారాయణ్ భట్నాగర్ ఆయన కుమారు లు అమిత్, సుమిత్లు డీపీఐఎల్కు ప్రమోటర్లుగా ఉన్నా రు. ఈ కంపెనీ విద్యుత్ కేబుళ్లు, పరికరాలను తయారుచేస్తుందని సీబీఐ తన చార్జ్షీటులో పేర్కొంది.
ముంబయి, ఏప్రిల్ 18: వరుసగా తొమ్మిది సెషన్ల పాటు లాభాలు గడించిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో స్వల్పంగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సెనె్సక్స్ 63 పాయింట్లు దిగజారి 34,331.68 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 22.50 పాయింట్లు పడిపోయి 10,526.20 పాయింట్ల వద్ద స్థిరపడింది.
భీమవరం, ఏప్రిల్ 18: అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు అదరగొడుతున్నా దేశీయ మార్కెట్లో ఆక్వా రైతులకు ఆ ఫలితం లభించడం లేదు. గత కొనే్నళ్లుగా ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ధరల విధానంలో కొనసాగుతున్న ఆటుపోట్ల కారణంగా కిలోకు రూ.100కు పైగానే రొయ్యల రైతులు నష్టపోతున్నారు. ఎక్స్పోర్టర్లు, దళారీలు సిండికేటుగా మారడంతో తామంతా కోట్లలో నష్టపోతున్నామని ఆక్వా రైతాంగం ఆందోళన వ్యక్తంచేస్తోంది.
పూణె, ఏప్రిల్ 18: బ్యాంకు ఋణాలు తీసుకున్నవారిలో చాలామంది ఒక్కరోజు డిఫాల్ట్ నిబంధనను పాటించడంలో వైఫల్యం చెందడంపై రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఎన్ ఎస్ విశ్వనాధన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైఫల్యం రుణదాతలు ఒక హెచ్చరికగా పరిగణిం చి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.