S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/06/2019 - 23:25

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్ అంచనాల రూపకల్పనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈనెల 14 నుంచి కసరత్తును ప్రారంభించనుంది. ఈ వార్షిక బడ్జెట్‌లోప్రధానంగా పలు క్లిష్టతర సవాళ్లు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నాయి. ఇందులో మరీ ముఖ్యమైంది ఆర్థిక మాంద్యం.

10/06/2019 - 23:24

ముంబయి, అక్టోబర్ 6: రిజర్వు బ్యాంకు మరోదఫా రెపోరేట్ల కోతను చేపడుతుందా? ఔననే అంటున్నారు వాణిజ్య విశే్లషకులు. వచ్చే డిసెంబర్‌లో జరిగే ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య వినిమయ విధాన నిర్ణాయక కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లలో మరో 0.25 శాతం తగ్గించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

10/06/2019 - 05:14

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గృహ నిర్మాణం కోసం 900 కోట్ల రూపాయలు పెట్టుబడిగా ఉంచాలని ప్రముఖ రియాలిటీ సంస్థ మిగ్‌సన్ గ్రూప్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో 2,326 గృహాలను నిర్మిస్తున్నట్టు ఈ సంస్థ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వీటిలో 850 గృహాలను కేటాయిస్తామని పేర్కొంది.

10/06/2019 - 02:50

న్యూఢిల్లీలోని అనుసంధాన్ భవన్‌లో గురువారం ప్రదర్శనకు ఉంచిన ‘గ్రీన్ క్రాకర్స్’. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యం వెదజల్లని ప్రత్యేక ఈ బాణా సంచాను సీఎస్‌ఆర్‌ఐ తయారు చేసింది. వీటిని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్దన్ ఇక్కడ జరిగిన ఓ ప్రత్యేక ప్రదర్శనలో విడుదల చేశారు.

10/06/2019 - 02:46

మండి, అక్టోబర్ 5: హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో పెట్టుబడిదారుల సమావేశం వచ్చేనెల 7, 8 తేదీల్లో జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు హాజరవుతారు. వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొంటారు. దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు.

10/06/2019 - 02:45

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: భారత స్టాక్ మార్కెట్ ఈ వారం నష్టాలను చవిచూశాయి. బేర్ మార్కెట్ నిరాటంకంగా కొనసాగింది. వరుస నష్టాలతో పలు పేరొందిన కంపెనీల షేర్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఒకవైపు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి మరొకవైపు ఆసియా స్టాక్ మార్కెట్‌ను దెబ్బతీశాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్లకు కూడా నష్టాలు తప్పలేదు.

10/06/2019 - 02:45

సింగపూర్, అక్టోబర్ 5: భారత్‌లో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న డీబీఎస్ బ్యాంక్ అంచనా వేసింది. డిసెంబర్‌లోనూ, తరువాత 2020లోనూ వడ్డీ రేట్ల తగ్గింపు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఇటీవలి కాలంలో కీలక వడ్డీ రేట్ల తగ్గింపును ప్రారంభించిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం వరుసగా అయిదోసారి రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

10/06/2019 - 02:35

విజయవాడ, అక్టోబర్ 5: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెతో ఆంధ్ర ప్రయాణికులకు సాధ్యమైనంత మేర ఇబ్బందుల్లేకుండా ఏపీఎస్ ఆర్టీసీ యుద్ధప్రాతిపదికన ప్రత్యేక బస్సులను రోడ్డు పైకి ఎక్కించింది. దసరా పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసం 130 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని కృష్ణా రీజినల్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు.

10/06/2019 - 02:32

అమరావతి, అక్టోబర్ 5: సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గు సరఫరాకు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఈనాటిది కాదని జెన్‌కో సీఎండీ బీ శ్రీ్ధర్ తెలిపారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పాదనకు సంబంధించి మహానంది కోల్ ఫీల్డ్స్ నుంచి సేకరణ తగ్గిన నేపథ్యంలో సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)తో 2014-15లో అప్పటి ప్రభుత్వం అవసరాలకు తగ్గట్టుగా దిగుమతి చేసుకుందన్నారు.

10/06/2019 - 02:11

విజయవాడ (క్రైం), అక్టోబర్ 5: దసరా పండుగ సందర్భంగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వారి స్వస్థలాకు అధిక సంఖ్యలో ప్రజలు కుటుంబ సమేతంగా రాకపోకలు సాగిస్తున్న దృష్టా రవాణా శాఖ ప్రజా రవాణాపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రైవేటు బస్సుల దోపిడీకి కళ్లెం వేసేందుకు జిల్లాలో తనిఖీలు నిర్వహించింది. ప్రైవేటు బస్సుల యాజమాన్యం ప్రయాణికుల నంచి అధిక వసూలుకు పాల్పడకుండా చర్యలు చేపట్టింది.

Pages