S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/14/2019 - 23:39

దిస్కిత్ (లడఖ్), సెప్టెంబర్ 14: దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్తగా ఏర్పాటయిన లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి లీడ్-బ్యాంక్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. నుబ్రా లోయలోని మారుమూల పట్టణమయిన దిస్కిత్‌లో ఎస్‌బీఐ కొత్త శాఖను ఆ బ్యాంక్ చైర్మ న్ రజ్‌నీశ్ కుమార్ శనివారం ప్రారంభించారు.

09/14/2019 - 23:38

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఎగుమతిదారులు రియాల్టీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం 70 వేల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడం పట్ల పారిశ్రామిక వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ చర్యలు నిర్ణయాత్మకంగా, సమగ్రంగా ఉన్నాయని అతి త్వరలోనే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దోహదం చేస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

09/14/2019 - 23:37

హైదరాబాద్, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో మల్బరీ పట్టుపురుగుల ఉత్పత్తుల పెంపకాలకు భారీగా రాయితీలను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. చైనా దేశం ఆధ్వర్యంలో త్వరలో గద్వాలలో భారీ పట్టుపరిశ్రమను నెలకొల్పుతున్నట్లు తెలిపారు.

09/13/2019 - 23:52

విశాఖపట్నం, సెప్టెంబర్ 13: గిరిజన ఉత్పత్తులను క్రయ, విక్రయాలు చేసేందుకు దేశంలోని 191 ఆన్‌లైన్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుకాసింగ్ అన్నారు. నేషనల్ ట్రైబుల్ మిషన్ ఆధ్వర్యంలో ఆదివాసీ మహోత్సవ్-2019 కార్యక్రమం విశాఖలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.

09/13/2019 - 21:54

ఫ్రాన్స్ కార్మిక శాఖ మంత్రి మురెల్ పెనిచాడ్ శుక్రవారం ప్రారంభించిన క్లెర్మంట్ ఫెరాండ్‌లోని వాణిజ్య సంస్థల సముదాయం. ‘హాల్ 32’ పేరుతో నిర్మించిన ఈ భవనంలో పలు వాణిజ్య, వ్యాపార సంస్థలకు చెందిన కార్యాలయలు పని చేస్తాయ.

09/13/2019 - 21:51

ముంబయి, సెప్టెంబర్ 13: ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం మరో విడత రేట్ల కోతను రిజర్వు బ్యాంకు చేపడుతుందన్న ఊహాగానాలు శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతాన్నిచ్చాయి. దీంతో వాణిజ్య వారం చివరిరోజు సూచీలు మంచి లాభాలను నమోదు చేశాయి. అలాగే అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న ఆశాభావంతో అంతర్జాతీయ మార్కెట్లు గణనీయంగా పుంజుకోవడం సైతం దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారింది.

09/13/2019 - 21:49

ముంబయి, సెప్టెంబర్ 13: వాణిజ్యవార ప్రాతిపదికన పరిశీలిస్తే గడచిన కొన్ని వారాలుగా నష్టాలనే నమోదు చేస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం లాభాలను సంతరించుకున్నాయి. శుక్రవారంతో ముగిసిన ఈవారంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్స క్స్ 403.22 పాయింట్లు, బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 129.70 పాయింట్ల వంతున లాభపడ్డాయి. కాగా గురువారం విదేశీపోర్టుపోలియో మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికర కొనుగోలుదారులుగా నిలిచారు.

09/13/2019 - 21:48

ఇమ్మిగ్రేషన్స్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవహారాల్లో అమెజాన్ వంటి బడా కంపెనీలు జోక్యం చేసుకుంటన్నాయని ఆరోపిస్తూ, ట్రంప్ ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న డిమాండ్‌తో వాషింగ్టన్ డీసీలోని మిచెల్ పార్క్ నుంచి జెఫ్ బెజాస్ హోమ్ వరకూ భారీ ర్యాలీలో పాల్గొన్న సమాజిక కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు.

09/13/2019 - 21:46

వాషింగ్టన్, సెప్టెంబర్ 13: ప్రస్తుత అంచనాలకంటే భారత దేశ ఆర్థికాభివృద్ధి రేటు మరింత బలహీనంగా ఉండే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న కార్పొరేట్, పర్యావరణ నియంత్రణ అనిశ్చితి, కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల ఆర్థిక స్థితి ఊగిసలాటను దృష్టిలో ఉంచుకుని తామీ అంచనాలు వెల్లడిస్తున్నట్టు ఐఎంఎఫ్ పేర్కొంది.

09/13/2019 - 21:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, కొనసాగించేందుకు అమెరికన్ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్ల పట్ల, అలాగే ఇక్కడ ఆ దేశానికి ఉన్న వాణిజ్యలోటు పట్ల అమెరికా అసంతృప్తిని వ్యక్తం చేసింది. శుక్రవారం నాడిక్కడ జరిగిన ‘్భరత-అమెరికా ఆర్థిక శిఖరాగ్ర సదస్సుకు అమెరికన్ వాణిజ్య వ్యవహారాల శాఖ మినిస్టర్ కౌనె్సలర్ ఐలీన్ నంది హాజరయ్యారు.

Pages