S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/03/2019 - 00:32

హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. పదేళ్లనాటి ఈ కేసును విచారించిన కోర్టు మంగళవారం మోహన్‌బాబుకు జైలు శిక్ష విధించింది. తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై మోహన్‌బాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

04/02/2019 - 22:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2015 అల్లర్ల కేసులో దోషిగా పేర్కొంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ హార్దిక్ సుప్రీంను ఆశ్రయించారు. స్టే పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి హార్దిక్ పోటీ చేయనున్నారు.

04/02/2019 - 04:56

హైదరాబాద్/ వనస్థలిపురం, ఏప్రిల్ 1: ఫేస్‌బుక్ ద్వారా కిడ్నీ కావాలని ప్రకటనలు చేస్తూ అమాయక ప్రజల కిడ్నీలను అమ్ముకుంటున్న అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

04/02/2019 - 04:43

న్యూఢిల్లీ: ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)కు అనుసంధానించిన వీవీ ప్యాట్‌ల (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) స్లిప్పుల లెక్కింపులో ప్రస్తుతం అవలంబిస్తున్న విధానమే అనుకూలమైనదని కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన ఆఫిడవిట్‌పై అభిప్రాయాలను తెలియజేయాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు ఆదేశించింది.

04/02/2019 - 02:55

ఉప్పల్, ఏప్రిల్ 1: కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడుప్పల్ అంబేద్కర్‌నగర్‌లో నివసిస్తున్న తూళ్ల కవిత (21)కు నరేష్‌తో పది నెలల క్రితమే పెళ్లి జరిగింది. సోమవారం భర్త పనిపై బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న కవితకు అకస్మాత్తుగా కడుపునొప్పి వచ్చింది. దీంతో భరించలేక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

04/02/2019 - 02:54

ఉప్పల్, ఏప్రిల్ 1: తాగిన మైకంలో ఓ యువకుడిని చితకబాది తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు యువకులను మేడిపల్లి పోలీసులు అరెస్టుచేసి సోమవారం కోర్టుకు రిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం బొలెరా వాహనం కొన్న వెంకట్‌రెడ్డి స్నేహితులైన తూంకుంట బేసిరెడ్డి, అన్నపురెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిలకు దావత్ ఇచ్చేందుకు ప్రధాన రహదారిలోని శ్రీ లక్ష్మి వైన్‌షాపుకు ఆదివారం వచ్చారు.

04/02/2019 - 02:54

వనస్థలిపురం, ఏప్రిల్ 1: ఎస్‌ఐ రాజయ్య మరో వివాహం చేసుకుని కుంటుంబ సభ్యులను పట్టించుకోవడం లేదని రాజయ్య భార్య ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎస్‌ఐగా పని చేస్తున్న రాజయ్యకు మూడవ భార్యగా ఉన్న రేణుకకు ముగ్గురు పిల్లలు.

04/02/2019 - 02:25

న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో ప్రదర్శనపై హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తివేయాలని చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ముకుల్ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.

04/01/2019 - 04:21

కొత్తూరు, మార్చి 31: ప్రైవేట్ రిసార్ట్‌పై శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి నందిగామ మండలం పెద్దకుంటతండా సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ రిసార్ట్‌పై శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

04/01/2019 - 04:21

శంషాబాద్, కొత్తూరు రూరల్, మార్చి 31: ఇటీవలే ఇద్దరూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. ఇద్దరూ చదువుకొని ప్రయోజకులవుతారని ఆశించిన తల్లిదండ్రులు ఆదివారం పిడుగులాంటి వార్త విని శోకసంద్రంలో మునిగారు.

Pages