S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/07/2019 - 05:24

హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 48,14,43,846 రూపాయల నగదు, ఇతర వస్తువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుండి పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ ఇతర శాఖలు రోడ్లపై తనిఖీలు చేయడం ప్రారంభించాయి. అక్రమంగా ఎక్కడైనా, ఎవరైనా నగదు, ఇతరత్రా వస్తువులు దాచి ఉన్నట్టు సమాచారం అందితే మెరుపుదాడులు చేస్తున్నారు.

04/07/2019 - 04:38

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టయిన డిఫెన్స్ ఏజెంట్ సుశేన్ మోహన్ గుప్తా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై స్పందనను తెలియజేయాల్సిందిగా ఢిల్లీలోని ఓ కోర్టు శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను ఆదేశించింది. రూ. 3,600 కోట్ల విలువ గల వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో ఈడీ సుశేన్ మోహన్ గుప్తాను అరెస్టు చేసింది.

04/07/2019 - 04:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఢిల్లీలోని హెరాల్డ్ హౌజ్ భవనాన్ని ఖాళీ చేయాలని ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది.

04/07/2019 - 01:52

జీడిమెట్ల, ఏప్రిల్ 6: దాచుకున్న డబ్బులు ఇవ్వనందుకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించి విషం సేవించిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట డివిజన్ బీరప్పనగర్‌లో నివాసముండే చితనూర్ మల్లికార్జున్ (26) స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి భార్య నాగరాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

04/06/2019 - 00:08

కేసముద్రం, ఏప్రిల్ 5: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో గురువారం రాత్రి శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్య అనూష (22)ను ఇంట్లోని రేకుల పైకప్పు పైపునకు ఉరేసి చంపినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. మృతురాలి తండ్రి సామేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఎస్‌ఐ కథనం ప్రకారం.. నెల్లికుదురు మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన శ్రీకాంత్, అనూష వేర్వేరు కులాలకు చెందినవారు.

04/06/2019 - 00:07

అల్లాదుర్గం, ఏప్రిల్ 5: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటెయనర్ బస్సును ఢీకొనడంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కంగ్టి మండలంలోని నాగర్‌గిద్ద మండలం కేశ్‌వార్ గ్రామానికి చెందిన మైనార్టీ సోదరులు హైదరాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.

04/05/2019 - 23:50

శ్రీకాకుళం, ఏప్రిల్ 5: ఇరవై ఐదు మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి పాలకొండకు కొద్ది నిమిషాల్లో చేరనున్న ఆర్టీసీ బస్సు నుంచి 5.07 కోట్ల నగదును రాజాం పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బస్సులో మాజీ జడ్పీచైర్మన్ పాలవలస రాజశేఖరం తనయుడు, పాతపట్నం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి సోదరుడు పాలవలస విక్రాంత్ ఉండటంతో ఆయనకు చెందిన సొత్తే అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తపరుస్తున్నారు.

04/05/2019 - 23:18

హైదరాబాద్, ఏప్రిల్ 5: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ శుక్రవారం నాడు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్ కొల్‌కటా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ కావడంతో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు.

04/05/2019 - 22:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తున్న పసుపుకుంకుమకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటితోపాటు అన్నదాత, వృద్ధాప్య ఫించన్ల పథకాలకు కూడా పచ్చ జెండా పూపింది. రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ముందు నుండే ఈ పథకాలు అమలవుతున్నందున, ఎన్నికల దృష్ట్యా వీటికి సంబంధించిన నగదును పంపిణీ చేసుకోవచ్చునని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

04/05/2019 - 22:09

హైదరాబాద్, ఏప్రిల్ 5: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టబడుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు దాదాపురూ 9.45 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ జంటనగరాల్లో ఎన్నికల సందర్భంగా తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. బంజారాహిల్స్ పోలీసులు గురువారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేయడంతో రూ.

Pages