S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జైలవకుశ’ సినిమాతో కొత్త ఉత్సాహంతో ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి వసూళ్లతోపాటు నటుడిగానూ ఆకాశానికి ఎత్తేసింది. ఏకంగా మూడు పాత్రల్లో నటించి అదరగొట్టిన ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ చిత్రం క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్తో రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరిలో సెట్స్పైకి రానున్నదట.
పవర్స్టార్ పవన్కళ్యాణ్ మరోసారి తండ్రయ్యాడు. తాజాగా ఆయన భార్య అన్నా లెజ్నేవా మగ బిడ్డకు జన్మనిచ్చింది. రేణు దేశాయ్ని పెళ్లిచేసుకున్న పవన్, కొన్నాళ్లు కాపురం చేసిన తరువాత ఆమెతో విడిపోయాడు. ఇప్పటికే వీరిద్దరికి కూతురు, కుమారుడు ఉండగా, తాజాగా అన్నా లెజ్నేవాకు మగ బిడ్డ జన్మించింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. తమ అభిమాన నటు డు తండ్రవ్వడంతో పవన్ అభిమానుల్లో కోలాహలం నెలకొంది.
రామ్, అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ సమర్పణలో కృష్ణ చైతన్య నిర్మిస్తున్న చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ చిత్రంలోని పాటలను ఈనెల 13న విడుదల చేయనున్నారు. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- రామ్, దేవిశ్రీల కాంబినేషన్లో వస్తోన్న ఐదవ చిత్రమిది.
కోలీవుడ్ స్టార్ విజయ్, సమంత, కాజల్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా అట్లీ దర్శకత్వంలో తేన్నాండాల్ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అదిరింది’. తమిళ్లో ‘మెర్సల్’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. ఈ నెల 18న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా మురళి రామస్వామి మాట్లాడుతూ- శరత్ మరార్తో కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం.
ప్రస్తుతం ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో నటించిన రవితేజ, మరోవైపు ‘టచ్ చేసి చూడు’ సినిమాలో కూడా నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వరుస పరాజయాలతో కెరీర్ పరంగా వెనుకబడిన రవితేజ, ‘రాజా ది గ్రేట్’తో విజయాన్ని అందుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతోపాటు తాజాగా మరో చిత్రానికి ఓకె చెప్పాడని తెలుస్తోంది.
యాంకర్ ప్రేమా మాలిని దర్శకత్వంలో అర్చన, శివకుమార్ రామచంద్రవరపు ముఖ్యపాత్రల్లో నటించిన ఇండిపెండెంట్ ఫిలిం ‘ఐ లైక్ ఇట్ దిస్ వే’. ఈ చిత్ర ప్రీమియర్ షో ప్రదర్శన హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు శేఖర్ కమ్ముల, నీలకంఠ, నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరోయిన్ మధుశాలిని, అర్చన, ప్రేమమాలిని, శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు.
బయోపిక్ల హ వా తగ్గడంలేదు సరికదా పెరుగుతూనే వుంది. ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్లో దుమ్మురేపాయి. ప్రస్తుతం పలు బయోపిక్ చిత్రాలను తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు నటీనటులు కూడా ఈ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా పరుగుల రాణి పి.టి.ఉష జీవిత కథతో బాలీవుడ్లో సినిమా తెరకెక్కనుంది.
నాగార్జున, సమంత, సీరత్కపూర్ ప్రధాన పాత్రల్లో ఓంకార్ దర్శకత్వంలో పి.వి.పి సినిమా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన చిత్రం ‘రాజుగారి గది-2’. ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతున్న సందర్భంగా ఇందులో హీరోయిన్గా నటించిన సీరత్కపూర్ చెప్పిన విశేషాలు..
నచ్చిన పాత్ర
టాలీవుడ్ క్రేజీ భామ రకుల్ ప్రీత్సింగ్ తన పుట్టిన రోజును అభిమానుల మధ్య ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్, రాజేంద్రనగర్లోని చెరిష్ అనాథ శరణాలయంలో పిల్లలకు పుస్తకాలు, పెన్లు, పిజ్జా, బర్గర్లు పంపిణీ చేసి, తన డాన్స్, నటనతో పిల్లలను ఆనంద పరిచారు. ఇందులో భాగంగా ‘జబర్దస్త్’ కమెపియన్ రచ్చ రవి కూడా తన హాస్యంతో పిల్లలను ఆకట్టుకున్నారు.
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమాన్యుయల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. గత నెల 24నుండి అక్కడ చిత్రీకరిస్తున్నారు.ఇదివరకే హైదరాబాద్లో రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఊటీలో ఈనెల 10 వరకు జరగనుంది. అ తరువాత షెడ్యూల్ను హైదరాబాద్లో జరుపుతారట.