-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, జూలై 23: వివిధ అంశాలపై పార్లమెంట్తో సంబంధం లేకుండా ఆర్డినెన్సులను జారీ చేయటం సరికాదని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రభుత్వానికి హితవు చెప్పారు. తప్పనిసరయితే తప్ప ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకోవద్దని ఆయన సూచించారు.
ఉదయ్పూర్, జూలై 22: అహ్మదాబాద్ నుంచి యాత్రికులతో బయలుదేరిన బస్సు రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్పూర్లోని నెహ్లా గ్రామంలో ప్రమాదానికి గురైన సంఘటనలో 9 మంది మృతిచెందగా, 22మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలున్నారు. యాత్రికులను తీసుకెళ్తున్న గుజరాత్కు చెందిన ప్రైవేటు బస్సు శనివారం నెహ్లా గ్రామంలో డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి పల్టీ కొట్టింది.
శ్రీనగర్, జూలై 22: అమర్నాథ్ యాత్రకు సివిల్ డ్రెస్లో వెళ్లి తిరిగి వస్తున్న సైనికులను పోలీసులు అడ్డుకోవడం చినికి చినికి గాలివానగా మారింది. రెచ్చిపోయిన ఆర్మీ జవాన్లు పోలీసు స్టేషన్పై దాడి చేసి అడ్డువచ్చిన పోలీసులను చితకబాదడంతో ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు 24 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన జవాన్లపై కేసు నమోదు చేశారు.
భోపాల్, జూలై 22: పార్లమెంటు సమావేశాలు ఏడాదికి కనీసం వంద రోజులు జరిగేలా ఒక చట్టాన్ని తీసుకురావాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. గత రెండు మూడేళ్లుగా పార్లమెంటు ఏడాదికి 60-70 రోజులకు మించి సమావేశం కాలేదని ఆయన చెప్పారు. ‘పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు కనీసం వంద రోజులు సభ్యులు చురుగ్గా పాలుపంచుకునేలా చూసే ఒక చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉంది.
న్యూఢిల్లీ, జూలై 22: రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్లు పెంచేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపాదించే సూచనలు కనిపించటం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పచ్చజెండా చూపిస్తేతప్ప ఈ బిల్లుకు మోక్షం లభించదని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ, జూలై 22: కొత్త రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్ కార్యదర్శిగా సంజయ్ కొఠారి నియమితులయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్గా సంజయ్ ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్టు అశోక్ మాలిక్ను కోవింద్ ప్రెస్ కార్యదర్శిగా నియమిస్తారు, ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ, జూలై 22: గుజరాత్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శంకర్సింగ్ వాఘేలా పార్టీకి రాజీనామా చేయటంతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రాజ్యసభకు తిరిగి ఎన్నిక కావటం అసాధ్యంగా మారింది. గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికైన అహ్మద్ పటేల్ ప్రస్తుత సభ్యత్వం వచ్చే నెల 18తో ముగుస్తోంది.
న్యూఢిల్లీ, జూలై 22: బిహార్లో అధికారంలో ఉన్న మహాకూటమిలో విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, జెడి(యు) అధ్యక్షుడు కూడా అయిన నితీశ్ కుమార్ శనివారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారు.
న్యూఢిల్లీ, జూలై 22: దేశంలోని మూడు ఐఐటిల్లో నిధుల దుర్వినియోగమైనట్టు కాగ్ బయటపెట్టింది. జోధ్పూర్, రూర్కీ, మద్రాస్ ఐఐటిల్లో నిధుల దుర్వినియోగం, అవకతవకలు జరిగినట్టు కంప్ట్రోలర్ ఆడిటర్ జననల్ నివేదికలో పేర్కొన్నారు. 2016 మార్చి మాసాంతానికి సంబంధించిన కాగ్ విడుదల చేసిన నివేదికలో 18.03కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టు వెల్లడించారు.
శ్రీనగర్, జూలై 22: కాశ్మీర్ వివాదంపై అమెరికా, చైనా లేదా ఏ ఇతర దేశం మధ్యవర్తిత్వం అక్కర్లేదని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. కాశ్మీర్ సమస్యను భారత్, పాకిస్తాన్లు పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అంతేగాని మూడో దేశం మధ్యవర్తిత్వం అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. అమెరికా, చైనాలు వారి పనులు వారు చూసుకుంటే మంచిదని హితవు పలికారు.