పశువుల తరలింపులో నిబంధనలు పాటించాలి
Published Thursday, 8 December 2016నల్లగొండ టౌన్, డిసెంబర్ 8: పశువులను వాహనంలో తరలించేటప్పుడు నియమ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన జిల్లాస్ధాయి పశువుల కౄరత్వ నిరోధకస్ధాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పక్షులు, కోళ్లు, జంతువులను తరలించేటప్పుడు కౄరత్వ నిరోదానికి నిర్వాహకులు వ్యక్తులకు ముందస్తుగా అవగాహన కల్పించాలని సూచించారు. అందుకు కావల్సిన వస్తువులను, సరఫరా చేసి అందరికీ చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.