పౌష్టికాహార లోపంతో గర్భిణుల మరణాలు ఉండకూడదు
Published Tuesday, 31 May 2016ఏలూరు, మే 30: జిల్లాలో పౌష్టికాహారం లోపం కారణంగా ఏ గర్భిణీ అయినా మరణిస్తే సంబంధిత ఐసిడిఎస్ సిబ్బందిని బాధ్యులను చేసి ఉద్యోగం నుండి తొలగిస్తానని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్ధానిక కలెక్టరేట్లో సోమవారం ఐసిడిఎస్ కార్యక్రమాలను అధికారులతో ఆయన సమీక్షించారు. పోలవరం మండలం పెదరాల గ్రామానికి చెందిన అన్నికి బేబి అనే గర్భిణీ మృతి చెందడంపై కలెక్టరు స్పందిస్తూ సంబంధిత అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గర్భిణీ మృతిపై సరైన వివరణ లేకపోవటం, రికార్డుల్లో ఉన్న వివరాలకు, సిబ్బంది చెప్పిన కారణాలకు పొంతనలేకపోవటంతో పోలవరం సిడిపిఓపై ఆగ్రహం వ్యక్తంచేశారు.