బయో కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయాలి
Published Tuesday, 31 May 2016శ్రీకాకుళం(టౌన్), మే 30: డి.మత్స్యలేశం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన బయో కెమికల్ ఫ్యాక్టరీ వలన పరిసర గ్రామాల జలవనరులు కలుషితమవుతున్నందున తక్షణమే ఆ ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం, రాళ్లుపేట, ఎస్.డి.పాలెం, కె.డి.పాలెం తదితర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ సముద్రతీర మత్స్యకార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమం అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. హేచరీ వలన చుట్టుపక్కల ఉన్న చెరువులు, గుంటలు కనుమరుగైపోయాయన్నారు.