కొత్త జిల్లాలను స్వాగతిస్తున్నాం
Published Tuesday, 31 May 2016ఖమ్మం(కల్చరల్), మే 30: పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక రాజ్పథ్ ఫంక్షన్హాల్లో జరుగుతున్న రాజకీయ శిక్షణా తరగతుల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఆదివారం విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 14,15 కొత్త జిల్లాలను ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రకటన చేయాలనుకోవడం సంతోషించదగిన విషయమన్నారు.