మొదలైన టి.ఎమ్సెట్-2
Published Tuesday, 31 May 2016హైదరాబాద్, మే 30: మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం ఎమ్సెట్-2 నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 1నుండి స్వీకరించనుంది. దాదాపు 60వేల మంది పరీక్షకు దరఖాస్తు చేస్తారని అంచనా. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువమందికి హైదరాబాద్లో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల్లోనూ పరీక్ష కేంద్రాలకు సన్నాహాలు చేస్తున్నారు. రాజధానిలోని వివిధ వర్శిటీల్లోని కేంద్రాలను ఇప్పటికే ఎమ్సెట్ అధికారులు మాట్లాడి ఉంచారు. ఎక్కువమంది హైదరాబాద్ నుంచే పరీక్షకు హాజరుకావచ్చని అధికారులు భావిస్తున్నారు.