రాజ్యసభ బరిలో టిజి
Published Tuesday, 31 May 2016కర్నూలు, మే 30 : రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒక సభ్యుడిగా అధికార తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి టిజి వెంకటేష్ను బరిలోకి దించాలని నిర్ణయించింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో సోమవారం నిర్వహించిన పలు సమీక్షలు, సమావేశాల అనంతరం టిజి వెంకటేష్ పేరును ఖరారు చేశారు. టిడిపి తరపున నాలుగో అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ నిర్ణయిస్తే పోటీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో టిజి ఎన్నిక కావడానికి పోలింగ్ పూర్తయ్యే వరకూ ఆగాల్సి ఉంటుంది. నాలుగో అభ్యర్థిపై వెనక్కి తగ్గితే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.