జివో 279 రద్దుచేయాలని మున్సిపల్ కార్మికుల ధర్నా
Published Tuesday, 31 May 2016ఒంగోలు, మే 30: మున్సిపల్ కార్మికుల ఉపాధి దెబ్బతీసే జీవో 279ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లారుూస్ యూనియన్ (సిఐటియు) నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు బి వెంకట్రావు, కొర్నెపాటి శ్రీనివాసరావు మట్లాడుతూ జీవో 279ని రద్దుచేయాలని గత ఐదు నెలలుగా మున్సిపల్ కార్మికులు పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 30న చలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గినట్లు వారు తెలిపారు.