S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/26/2018 - 00:18

ముంబయి, మార్చి 25: భారత జట్టు బౌలింగ్‌లో మరింత పరిణితి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంగీకరించింది.

03/25/2018 - 04:23

కోల్‌కతా: భారత టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇక్కడ జరిగిన ఒక అంతర్ క్లబ్ టోర్నీలో కేవలం 20 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచనం సృష్టించాడు. వచ్చే నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌కు సన్నాహక టోర్నమెంట్‌గా నిర్వహిస్తున్న ఈ పోటీలో మోహన్ బగాన్ తరఫున ఆడుతున్న సాహా బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేస్ (బీఎన్‌ఆర్)పై 20 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

03/25/2018 - 00:22

న్యూఢిల్లీ, మార్చి 24: తెలుగు తేజం, బాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు అరుదైన గౌరవం లభించింది. వచ్చేనెల ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగే కామనె్వల్త్ గేమ్స్‌లో భారత్ తరఫున ఫ్లాగ్‌బేరర్‌గా జాతీయ పతాకాన్ని పట్టుకొని మార్చ్‌పాస్ట్‌లో ముందు నడిచేందుకు భాతర ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆమెను ఎంపిక చేసింది. గత మూడు కామనె్వల్త్ గేమ్స్‌లోనూ షూటర్లకే ఈ అవకాశం దక్కగా, ఈసారి సింధును ఆ అదృష్టం వరించింది.

03/25/2018 - 00:20

ఆక్లాండ్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోగా, పిచ్‌ని కవర్లతో కప్పి ఉంచిన దృశ్యం. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 58 పరుగులకే ఆలౌట్ చేసిన న్యూజిలాండ్ ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్‌లో రెండు రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 229 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించగా, మరో నాలుగు పరుగులు జత కలిశాయి.

03/25/2018 - 00:19

కీ బిస్కెన్, మార్చి 24: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో బై లభించిన ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌కు రెండో రౌండ్‌లో బెనొట్ పైర్ షాకిచ్చాడు. జొకోవిచ్ ఆటను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులను అతని ఏ దశలోనూ పుంజుకోకపోవడంతో నిరాశ చెందారు. పైర్ 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో జొకోవిచ్‌ను చిత్తుచేసి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.

03/25/2018 - 00:17

యాంగాన్ (మయన్మార్), మార్చి 24: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ మరో టైటిల్‌ను సోంతం చేసుకున్నాడు. ఆసియా బిలియర్డ్స్ టోర్నమెంట్ ఫైనల్లో నిరుటి విజేత అద్వానీ 6-1 తేడాతో తన ప్రాక్టీస్ భాగస్వామి భాస్కర్‌పై విజయం సాధించి టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. గత ఏడాది బిలియర్డ్స్‌లో ప్రపంచ, ఆసియా చాంపియన్‌షిప్స్‌ను కైవసం చేసుకున్న అద్వానీ ఈ ఏడాది మరోసారి ఈ రెండు టైటిళ్లను నిలబెట్టుకొన్నాడు.

03/25/2018 - 00:16

కరాచీ, మార్చి 24: కరాచీకి మళ్లీ క్రికెట్ కళ వచ్చింది. అడుగడుగునా భద్రతా బలగాలు మోహరించినప్పటికీ, క్రికెట్ అభిమానులు ఆదివారం జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) లీగ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత కరాచీలో మళ్లీ క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో, నగరం మొత్తం సరికొత్త హంగులతో ముస్తాబైంది.

03/25/2018 - 00:15

న్యూఢిల్లీ, మార్చి 24: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలో భారత్ జట్టు ఆడనున్న ఓ చరిత్రక మ్యాచ్‌కి దూరం కానున్నాడు. సౌతాఫ్రికా సిరీస్ తర్వాత భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన నిదహాస్ ట్రోఫీ ముక్కోణపు టీ-20 టోర్నమెంట్ నుంచి కోహ్లీ విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ మాసంలో ప్రారంభం కానున్న 11వ ఐపీఎల్‌లో బెంగుళూరు జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించనున్నాడు.

03/25/2018 - 00:14

దంబుల్లా, మార్చి 24: మహిళల క్రికెట్‌లో శ్రీలంకకు పాకిస్తాన్ వైట్‌వాష్ వేసింది. శనివారం జరిగిన చివరి, మూడో వనే్డలో పాకిస్తాన్ 108 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థిని 107 పరుగులకే ఆలౌట్ చేసి, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది.

03/25/2018 - 00:13

ముంబయి, మార్చి 24: ఇటీవల దక్షిణాఫ్రికా టూర్‌లో జరిగిన రెండు సిరీస్‌లలో ఘన విజయం తర్వాత కొద్దిరోజుల కిందట ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, ఇపుడు జరుగుతున్న టీ-20 ముక్కోణపు సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన తామేమీ బెంబేలెత్తిపోవడం లేదని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది.

Pages